BigTV English
Advertisement

Farm Loan: ఆ రైతులకు అందుకే రుణమాఫీ కాలేదు: వీహెచ్

Farm Loan: ఆ రైతులకు అందుకే రుణమాఫీ కాలేదు: వీహెచ్

V Hanumantha Rao: ఒక లక్షలోపు పంట రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే, కొందరు రైతులు తమ రుణాలు మాఫీ కాలేదని మీడియా ముందుకు రావడం చర్చనీయాంశమైంది. తమకు అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదని వాపోయారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, టీపీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు.


ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ కాంగ్రెస్ పార్టీదని, అందుకే తాము ఇచ్చిన హామీకి అనుగుణంగానే రుణమాఫీ చేపడుతున్నామని వీహెచ్ తెలిపారు. మాట ఇచ్చామని, ఇప్పుడు చేసి చూపిస్తున్నామని వివరించారు. అయితే, కొందరికి రుణమాఫీ కాలేదన్న వాస్తవాన్ని ఆయన ధ్రువీకరించారు. వారు ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోకపోవడం వల్లే మాఫీ కాలేదని తెలిపారు.

రైతులందరికీ, అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని వీహెచ్ చెప్పారు. సిద్దిపేటలో ఆయన విలేకరులో మాట్లాడుతూ.. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ కూడా జరుగుతుందని, వచ్చే నెలలో ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుందని వివరించారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తామని చెప్పి ఆ తర్వాత దళిత సమాజాన్ని మోసం చేశారని ఆరోపించారు. కానీ, తాము భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎంగా చేసి దళితుల ఆత్మగౌరవాన్ని పెంచామని వివరించారు.


Also Read: పూజా ఖేడ్కర్‌ ఐఏఎస్ అభ్యర్థిత్వం రద్దు.. మరో సారి పరీక్ష రాయకుండా డిబార్

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని వీహెచ్ అన్నారు. కానీ, తాము అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఉద్యోగాల భర్తీ మొదలు పెట్టామని వివరించారు. తమ హయాంలో పోటీ పరీక్షలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతియుతంగా జరుగుతున్నాయని, కానీ, కేసీఆర్ హయాంలో తరుచూ కోర్టుల చుట్టూ వ్యవహారాలు నడిచాయని గుర్తు చేశారు.

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చినప్పుడు ఆ పార్టీ పని ఖతమైందని వీహెచ్ అన్నారు. పార్టీలో తెలంగాణ తీసేసినప్పుడే పార్టీ పని అయిపోయిందని పేర్కొన్నారు. కేసీఆర్ పేరు కోసం అనేక ప్రాజెక్టులు కట్టాలని అనుకున్నారని, ఇప్పుడు ఆ ప్రాజెక్టులో భూమిలో కూరుకుపోతున్నాయని విమర్శించారు. ఆయన కట్టిన ప్రాజెక్టుల పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు.

Tags

Related News

Wine Shops Closed: మద్యం ప్రియులకు బిగ్‌ షాక్.. 4 రోజులు వైన్‌ షాపులు బంద్‌.. కారణం ఇదే..!

Hyderabad Metro: చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణ మ్యాప్‌ను సమర్పించండి: హై కోర్టు కీలక ఆదేశం

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌.. సీఎం రేవంత్‌ కీలక సమావేశం

Maganti Gopinath Family Dispute: మాగంటి కుటుంబంలో చిచ్చు.. BRS అభ్యర్థి సునీతకు ఊహించని షాక్

Jubilee Hills by Election: జూబ్లీహిల్స్‌ ఓటర్లకు హై అలర్ట్.. ఫోటో ఐడీ తప్పనిసరి

Telangana: కార్తీక పౌర్ణమి నాడు జంతుబలితో క్షుద్రపూజలు.. స్కూల్‌, శ్మశానవాటికలో..

Chevella Bus Accident: పైనుంచి నా కూతుళ్లు జీతం పంపించారా!! జ్ఞాప‌కాలు గుర్తు చేసుకొని బోరున ఏడ్చేసిన తండ్రి

Telangana Politics: కేసీఆర్‌పై సీబీఐ కేసు.. సీఎం రేవంత్ డిమాండ్‌పై స్పందించిన కిషన్ రెడ్డి

Big Stories

×