Aadi Srinivas: వేములవాడ శ్రీనివాస్కు తృటిలో పేను ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ నేతలు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని.. ఆయన మంగళవారం ఉదయం పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్ ఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్ పార్టీ నేతలతో కలిసి గృహ సముదాయం వద్ద బేస్ మెంట్ పై నిల్చొని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది కుంగింది. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు.. ఆది శ్రీనివాస్ కింద పడిపోకుండా పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అధికారులతో ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు.
ఈ ఘటన తర్వాత అధికారులు వెంటనే నిర్మాణ స్థలాన్ని మూసివేసి, ప్రమాదానికి దారితీసిన కారణాలపై సమగ్ర పరిశీలన ప్రారంభించారు. నిర్మాణ సంస్థపై బాధ్యతలు, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు.
ఇన్ ఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్ ఘటనను తీవ్రంగా పరిగణించి, బేస్మెంట్ నిర్మాణం ఎందుకు బలహీనంగా ఉందో, ఏ భాగంలో లోపం వచ్చినది అన్న వివరాలను ఇంజనీర్లతో సమీక్షించారు.
ఇళ్లు పూర్తిగా సురక్షితంగా, నాణ్యతతో నిర్మాణం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది అని అధికారులు తెలిపారు. సంఘటనపై సమగ్ర నివేదిక దాఖలు చేయనున్నారు అధికారులు.
ఈ ఘటనపై ప్రత్యేక ఇంజనీరింగ్ బృందం సమగ్ర నివేదిక సిద్ధం చేసి కలెక్టర్కు సమర్పించనుంది. బేస్మెంట్ కూలిన కారణాలు, నిర్మాణ బలహీనతలు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉన్నా, వినియోగించిన పదార్థాల్లో లోపాలు ఉన్నా అన్ని వివరాలు నివేదికలో చేరనున్నాయి.
Also Read: గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై.. సీఎం రేవంత్ సమీక్ష
ఈ ప్రమాదం ఎలాంటి ప్రాణనష్టం లేకుండా తృటిలో తప్పిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.