E-Paper
Advertisement

మందుబాబులకు యుద్ధం సెగ.. తెలంగాణలో మద్యం ధరలు పెరిగే ఛాన్స్, సమ్మర్‌‌ వేళ జేబుకు చిల్లు?

మందుబాబులకు యుద్ధం సెగ.. తెలంగాణలో మద్యం ధరలు పెరిగే ఛాన్స్, సమ్మర్‌‌ వేళ జేబుకు చిల్లు?

Telangana: ఇరాన్ యుద్ధం ప్రభావం అన్నిరంగాలపై క్రమంగా పడుతోంది. దేశంలోని రకరకాల వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. తెలంగాణలో మద్యం ప్రియులకు త్వరలో ఊహించని షాక్ తగలనుంది. వచ్చే నెల అంటే మే నుంచి మద్యం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు.

యుద్ధం సెగ మందుబాబులకు తగిలింది

పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి.  ముఖ్యంగా హోర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. కేవలం చమురుకు మాత్రమే కాదు.. వివిధ రంగాలపై దాని ప్రభావం పడుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతింది.

దాని మీద ఆధారపడిన రకరకాల ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. అందులో మద్యం సీసాలు కూడా ఒకటి. వాటి  ఉత్పత్తి ఖర్చులు అమాంతంగా పెరిగాయి. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు మొదలయ్యాయి. దీని కారణంగా దేశంలో గాజు సీసాల ఉత్పత్తి 40 శాతం వరకు పడిపోయింది. ఖాళీ సీసాల ధరలు 20 శాతం వరకు పెరిగాయి.

తెలంగాణలో మద్యం ధరలు పెరిగే ఛాన్స్? కమిటీ నివేదిక కోసం

అదనపు భారాన్ని భరించలేమని ధరలను పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కొద్దిరోజుల కిందట ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించాయి. ఇక తెలంగాణలో మద్యం ధరల పెంపు గడువు ఇప్పటికే పూర్తి అయ్యింది. రాష్ట్రంలో ప్రతి రెండేళ్లు ఒకసారి మద్యం ధరలను ప్రభుత్వం సమీక్షిస్తుంది.

2023 మే నెలలో ధరలను పెంచారు. దాని ప్రకారం గతేడాది మే నెలలో ధరలను సమీక్షించాల్సి ఉంది. ఆ గడువు ఎప్పుడో ముగిసింది. పరిశ్రమ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు తయారీ దారుల విజ్ఞప్తితో ప్రభుత్వం ధరల పెంపుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై అధ్యయనం చేసేందుకు ఓ జ్యుడీషియల్ కమిటీని ప్రభుత్వం నియమించింది.

ALSO READ: ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. బాసర క్షేత్రానికి నూతన వైభవం, రూ. 225 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం!

బాటిల్ సైజ్, బ్రాండ్ రేంజ్, ట్యాక్స్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరల పెంపుపై ఏప్రిల్ చివరినాటికి ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ లెక్కన తెలంగాణలో మద్యం ధరల పెరగడం ఖాయమని అంటున్నారు. గతేడాది 15 శాతం ధరలు పెరిగాయి. అయితే ప్రస్తుతం సీసాల కొరత, అల్యూమినియం ధరలు పెరగడంతో కంపెనీలు పెంపును కోరుతున్నాయి. వేసవికాలం కావడంతో బీర్లకు మాంచి డిమాండ్ నెలకొంది.

డిమాండ్ పెరుగుతుండగా సరఫరా తగ్గడంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాటికి కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది. కమిటీ నివేదిక ఆధారంగా మే నెలలో మద్యం ధరలు పెరగడం ఖాయమని చర్చించినట్టు కుంటున్కొంనారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందని ఆ శాఖ చెబుతున్నమాట. మొత్తానికి ఇరాన్ యుద్ధం కాదు చివరకు మందుబాబుల జేబులకు చిల్లు పడడం ఖాయం.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×