E-Paper
Advertisement

Warangal Airport: మామునూరు ఎయిర్‌పోర్ట్‌.. రెండు నెలల్లో శంకుస్థాపన, ఆ రెండింటిపై చర్చలు

Warangal Airport: మామునూరు ఎయిర్‌పోర్ట్‌.. రెండు నెలల్లో శంకుస్థాపన, ఆ రెండింటిపై చర్చలు
Advertisement

Warangal Airport: తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించానికి వేగంగా అడుగులు వేస్తోంది రేవంత్‌రెడ్డి సర్కార్. మరో రెండు నెలల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి శంకుస్థాపన పనులు మొదలు కానున్నాయి. ఇదే కాకుండా ఉత్తర తెలంగాణ  ఎయిర్‌పోర్టుకు సంబంధించిన పనులపై ఫోకస్ చేసింది ప్రభుత్వం.

మామునూరు ఎయిర్‌పోర్ట్‌.. రెండు నెలల్లో శంకుస్థాపన

Advertisement

తెలంగాణలో కొత్తగా ఎయిర్‌‌పోర్టులపై ఫోకస్ చేసింది రేవంత్‌రెడ్డి. దీనికి సంబంధించి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఆపై పర్యవేక్షణ చేస్తోంది. ఇక వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రెండు నెలల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూమి పూజ మొదలుపెట్టాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి 953 ఎకరాల భూమి సేకరించి కేంద్రానికి అప్పగించినట్టు తెలుస్తోంది.

శనివారం సచివాలయంలో కొత్త ఎయిర్‌పోర్టుల గురించి కీలక సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏవియేషన్ డైరెక్టర్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులతో ఆయన వివిధ అంశాలపై చర్చించారు. వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మంత్రి.

Advertisement

ఆదిలాబాద్- కొత్తగూడెం ఎయిర్‌పోర్టు పనులపై ఆరా

వరంగల్ విమానాశ్రయానికి సంబంధించి 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. సాంకేతిక అనుమతులు పూర్తి చేసి త్వరగా శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. అటు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టును రక్షణ శాఖ-పౌర విమానయాన శాఖ-రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి.

దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్‌ సిద్ధం చేయాలని అధికారులను కోరారు. భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తుందని ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు అధికారులకు తెలిపారు.  ఇక భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు సంబంధించి గతంలో ప్రతిపాదించిన భూమి అనుకూలంగా లేదని తెలిపింది పౌర విమానయాన శాఖ.

ALSO READ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం, జూన్ 2 నుంచి అమలు!

తాజాగా ఎయిర్ పోర్టు అధికారుల భేటీ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు మంత్రి పొంగులేటి. ఆ ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణంపై లోతైన అధ్యయనం చేయాలన్నారు. సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై కేంద్రంతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. భూసేకరణ, మౌలిక వసతుల ఏర్పాట్ల విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలన్నారు.

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×