E-Paper
Advertisement

MLC By Election Counting : ఉత్కంఠగా సాగుతున్న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు.. రాత్రికి ఫలితం ?

MLC By Election Counting : ఉత్కంఠగా సాగుతున్న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు.. రాత్రికి ఫలితం ?

MLC By Election Counting : వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతుంది. తొలిప్రాధాన్య ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన తీన్మార్ మల్లన్నకు, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి పోటా పోటీగా ఓట్లు పోలయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 42 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. మిగతా వారిలో తీన్మార్ మల్లన్న, రాకేశ్ రెడ్డిలకు ఓట్లు షేర్ అవుతూ వస్తున్నాయి.

తీన్మార్ మల్లన్న విజయానికి 31,386 ఓట్ల దూరంలో ఉండగా.. బీఆర్ఎస్ అభ్యర్థి 50,251 ఓట్ల దూరంలో ఉన్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,709 ఓట్లు పోలవ్వగా.. రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,712 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అయిన పాలకూరి అశోక్ కుమార్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. అది పూర్తయ్యాక.. బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాత్రిలోగా ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి.. విజేతను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

 

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×