E-Paper
Advertisement

CM Revanth Reddy: గల్ఫ్ కార్మికులకు బీమా.. ప్రత్యేక బోర్డు ఏర్పాటు..

CM Revanth Reddy: గల్ఫ్ కార్మికులకు బీమా.. ప్రత్యేక బోర్డు ఏర్పాటు..
Advertisement

CM Revanth Reddy latest speech(Telangana today news): గల్ఫ్ కార్మికులకు బీమా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే గల్ఫ్ కార్మికులు చనిపోతే రూ. 5 లక్షలు అందిస్తున్నామని సీఎం తెలిపారు. గల్ఫ్ కార్మిక సంఘాల నాయకుల సమావేశంలో మాట్లాడిన సీఎం.. సెప్టెండర్ 17 లోగా వారి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏజెంట్ల బారిని పడి కొందరు.. అక్కడకు వెళ్లాక యాజమాన్యం చేతిలో మరికొందరు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గల్ఫ్, ఇతర దేశాకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామన్నారు. ప్రజాభవన్‌లో ఒక ప్రత్యేక వ్వవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాట్ చేసి గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

సెప్టెంబర్ 17 లోగా గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కారించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్ విధానాలను స్పష్టంగా అధ్యయనం చేశామని తెలిపారు. ఇక కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా అధ్యయనం చేశామన్నారు. ఇప్పటికే ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేశామని ప్రస్థుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. కోడ్ ముగిశాక ప్రభుత్వం తరఫున కార్మిక సంఘాలను ఆహ్వానిస్తామని సీఎం స్పష్టం చేశారు. పాలసీ డాక్యుమెంట్ పై కార్మిక సంఘాల అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ముందుకెళతమని తెలిపారు.

Also Read: రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

గల్ఫ్ కార్మికులకు న్యాయపరమైన సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. వారు ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ఏజెంట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఒక వారం రోజులు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

Related News

పగలు రైతుల వేషం.. రాత్రి వేళ మోటార్ల చోరీ.. జనగామలో దొంగల ముఠా అరెస్ట్!

డీజీపీపై శివాలెత్తిన టీఆర్ఎస్ చీఫ్ కవిత.. చట్టాలు ఉండి ఏం లాభం?

కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ భారీ ధర్నా!

మేడ్చల్‌లో అక్రమ మద్యం మాఫియాకు ఇక చెక్.. కొత్త సీఐగా దీపికా భాధ్యతలు!

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు జోరు.. లక్ష్యాన్ని మించిన దరఖాస్తులు.. ఎన్నో తెలుసా..!

బిగ్ టీవీ వరుస కథనాలు.. రంగంలోకి దిగిన అధికారులు, దుర్గంచెరువు పరిశీలన

ఫేక్ ప్రచారాలపై..బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి ఫైర్

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

Big Stories

Advertisement
×