E-Paper
Advertisement

Telangan Police: మరీ ఇంత దారుణమా.. వైద్యశాలలో పేకాట… పట్టుబడిన మహిళలు

Telangan Police: మరీ ఇంత దారుణమా.. వైద్యశాలలో పేకాట… పట్టుబడిన మహిళలు
Advertisement

Telangan Police: డ్రగ్స్, మత్తు పదార్థాలు, పేకాట, చట్టవ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్లొద్దు.. వెళ్లారో ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదంటున్నారు తెలంగాణ పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు ముమ్మర దాడుల పర్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సాగిస్తున్నారు. ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అక్కడ వాలిపోతున్నారు తెలంగాణ పోలీసులు. దీనితో హడలెత్తి పోతున్నారు ఇలాంటి నేరస్థులు. హైదరాబాద్ నగరంలోనే కాక అన్ని జిల్లాల ఎస్పీల ఆదేశాలతో ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీస్ అధికారులు, సిబ్బంది సైతం అదే స్థాయిలో దాడుల పర్వాన్ని సాగిస్తున్నారు.

ప్రధానంగా పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై దూకుడు పెంచిన పోలీసులు.. ఎంతటి ప్రముఖులనైనా ఇట్టే కటకటాల్లోకి పంపించేస్తున్నారు. అటువంటి ఘటనే నిజామాబాద్ లో తాజాగా జరిగింది. ఇక్కడ పేకాట ఆడుతూ దొరికింది పురుషులు అనుకుంటే పొరపాటే.. వారందరూ మహిళలే. అందులో ప్రముఖ వైద్యుల సతీమణులని తెలుస్తోంది. నిజామాబాద్ పరిధిలో పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిఘా పెంచారు. ఈ తరుణంలోనే వారికి పట్టణంలోని ఓ ప్రముఖ వైద్యశాలలో పేకాట జోరుగా సాగుతుందని సమాచారం అందింది. అక్కడికి వెళ్ళిన పోలీసులు షాక్ కు గురయ్యారు.. కారణం అక్కడ పేకాట ఆడుతున్నది ఎవరో కాదు అంతా బడాబాబుల సతీమణులే.

Advertisement

నిజామాబాద్ పట్టణంలోని సరస్వతి నగర్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రి నాలుగో అంతస్థులో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు పోలీస్ రైడింగ్ సాగింది. అక్కడ డబ్బు పెట్టి పేకాట ఆడుతున్న నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15 వేల నగదుతో పాటు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడ్డ మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని సమాచారం. కాగా పోలీసులు వైద్యశాలలో దాడులు నిర్వహించడంతో ఈ విషయం సంచలనంగా మారింది. రోగులకు వైద్యసేవలు అందించే వైద్యశాలను.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: R Krishnaiah: బ్రేకింగ్ న్యూస్… కాంగ్రెస్‌లోకి ఆర్. కృష్ణయ్య ?

Advertisement

పోలీసులు మాత్రం మాకు ఎంతటి వారైనా ఓకే.. పేకాట ఆడారా.. లేదా.. అందుకే అదుపులోకి తీసుకున్నామంటూ తెలుపుతున్నారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని, అలాగే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ దాడుల పరంపర నిరంతరం కొనసాగుతుందని, యువత ఇటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి దాడుల పర్వాన్ని సాగించి, ఇలాంటి నేరస్థుల భరతం పట్టాలని ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలతోనే పోలీసులు దాడులను ముమ్మరం చేసి, ఇటీవల ఎందరో గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను పట్టుకున్నారు. అయితే ఈ దాడులలో పట్టుబడ్డ వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి కఠిన శిక్షలు అమలయ్యేలా పోలీసులు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారనే చెప్పవచ్చు. చివరగా ఇలాంటి అసాంఘిక చర్యలకు ఎవరైనా పాల్పడుతున్నారా.. ఖబడ్దార్ అంటున్నారు తెలంగాణ పోలీసులు.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×