ఇంట్లో ఉండాల్సిన నగదు మాయం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అశోక్, తన గోడును వెళ్లబోసుకోవడానికి సెల్ టవర్ను ఎంచుకున్నాడు. తన డబ్బు తనకు తిరిగి వచ్చే వరకు కిందకు దిగేది లేదని అక్కడి నుంచి కేకలు వేస్తూ ఆందోళన చేపట్టాడు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ ఎక్కిన యువకుడిని కిందకు దించేందుకు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. అశోక్కు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు, అలాగే కింద భారీగా జనం గుమిగూడటంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
Also Read: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
చివరికి పోలీసులు అతనికి భరోసా ఇవ్వడంతో అశోక్ శాంతించి కిందకు దిగాడు. ఎన్నికల డబ్బు కోసం ఒక యువకుడు ఇలా సెల్ టవర్ ఎక్కడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.