E-Paper
Advertisement

Hindenburg vs Adani: అదానీ గ్రూప్‌లో సెబీ ఛైర్‌పర్సన్‌‌కు వాటాలు.. మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్

Hindenburg vs Adani: అదానీ గ్రూప్‌లో సెబీ ఛైర్‌పర్సన్‌‌కు వాటాలు.. మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్
Advertisement

Hindenburg alleges SEBI chief Madhabi Buch linked to Adani offshore Entities: అదానీ గ్రూప్‌ కంపెనీలపై అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ మరో బాంబ్ పేల్చింది. సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పూరీ బచ్, ఆమె భర్తకు అదానీ సంస్థల్లో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. మారిసెస్ కంపెనీల్లోని ఇద్దరికీ రహస్య వాటాలున్నాయంటూ హిండెన్‌బర్గ్ అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు. దీంతో.. మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిండెన్ బర్గ్ ఆరోపణలతో మార్కెట్‌లో ఎలాంటి కుదుపు వస్తుందోనని భయపడుతున్నారు.

ఏడాదిన్నరగా అదానీ వర్సెస్ హిండెన్ బర్గ్ ఎపిసోడ్ నడుస్తోంది. 2023 జనవరి 23న కూడా హిండెన్‌బర్గ్ అదానీ సంస్థలపై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌ తమ కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని విమర్శించారు. ధరలు పెంచిన షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకొని మోసాలకు పాల్పడిందని గతేడాది హిండెన్ బర్గ్ ప్రధాన ఆరోపణ. కరేబియన్‌, మారిషస్‌ల నుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని అప్పటో బాంబ్ పేల్చింది.

Advertisement

హిండెన్ బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ షేర్లు నేల చూపులు చూశాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి గౌతమ్ అదానీ చాలా చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఫైనల్ గా మళ్లీ షేర్ విలువ పైకి వచ్చింది. హిండెన్‌బర్గ్ నివేదికపై సెబీ దర్యాప్తు చేసి కీలక విషయాలను కూడా ప్రకటించింది. అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.

Also Read: షాకిచ్చిన బంగారం.. మళ్లీ రూ.70 వేలు దాటేసిందిగా !

Advertisement

అంతేకాదు.. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెనక చైనా హస్తం ఉందనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల్లో సెబీ చైర్మన్ కు షేర్లు ఉన్నాయని ప్రకటించింది. గతంలో తమ నివేదికపై సెబీ దర్యాప్తు చేయకపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణమని హిండెన్ బర్గ్ ప్రధాన విమర్శ.

Related News

పిఎఫ్ సెటిల్మెంట్ ఆలస్యం చేస్తే వడ్డీ తప్పదా? EPFO కేసులో మండిపడిన కోర్టు

SBI తప్పిదం.. రోజుకు రూ.5 వేలు చెల్లించాలన్న కోర్టు, ఇలా మీకూ జరిగిందా?

మార్కెట్లో ఎగిసిన ముడి చమురు ధర.. బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లు, భారత్‌‌లో ధరలు పెరిగే ఛాన్స్

పసిడి ప్రియులకు పంగడే.. దిగొస్తున్న లోహాల ధరలు, తులం ఎంతంటే..

ఫోన్, కారు కంటే ఇల్లు ముఖ్యం? ఆర్థికపరంగా భారతీయుల ఆలోచనల్లో మార్పు

నిర్మాణ ఖర్చుల కంటే వేగంగా పెరుగుతున్న ఇళ్ల ధరలు.. కారణాలు ఇవే

ఎక్కువ షుగర్, సాల్ట్ ఉన్న ఫుడ్ ప్యాకెట్స్‌పై వార్నింగ్ లేబుల్స్ స్పష్టంగా ఉండాలి.. వినియోగదారుల డిమాండ్

రైతులకు కీలక కబురు.. పీఎం కిసాన్ స్కీమ్ 24వ విడత నిధులు, నవరాత్రుల సమయంలో

Big Stories

Advertisement
×