E-Paper
Advertisement

Trains Diverted: సికింద్రాబాద్ నుంచి 18 రైళ్లు డైవర్ట్, కారణం ఏంటంటే?

Trains Diverted: సికింద్రాబాద్ నుంచి 18 రైళ్లు  డైవర్ట్, కారణం ఏంటంటే?

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పలు రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లన హైదరాబాద్ లో వివిధ రైల్వే స్టేషన్ల నుంచి నడిపించనున్నట్లు తెలిపారు. మొత్తం 18 రైళ్లను సికింద్రాబాద్ నుంచి రైట్ డైవర్ట్ చేసినట్లు ప్రకటించారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 26 వరకు ఈ డైవర్షన్ కొనసాగనున్నట్లు తెలిపారు.

రైళ్ల డైవర్షన్ ఎందుకుంటే?

ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో పూర్తిగా కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ పనులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో పలు రైళ్లను ఇప్పటికే హైదరాబాద్ లోని పలు రైల్వే స్టేషన్ల నడిపిస్తున్నారు. తాజాగా మరో 18 రైళ్లను కూడా ఇతర స్టేషన్ల నుంచి ఆపరేషన్స్ కొనసాగిచనున్నట్లు తెలిపారు. ఈ 18 రైళ్లు మల్కాజ్‌ గిరి, హైదరాబాద్ (నాంపల్లి), చర్లపల్లి నుంచి నడిపించనున్నట్లు తెలిపారు. ప్రయాణీకులు ఆయా రైళ్లు ఎక్కడి నుంచి నడుస్తున్నాయో తెలుసుకుని ప్రయాణీకులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఈ మేరకు 18 రైళ్లలు ఎక్కడ నుంచి ఎప్పుడు బయల్దేరుతాయి అనే వివరాలను అధికారికంగా ప్రకటించారు.

ఏ రైళ్లు ఏ స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తాయంటే?

సౌత్ సెంట్రల్ రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ 18 రైళ్లు ఇప్పుడు సికింద్రాబాద్‌కు బదులుగా మల్కాజ్‌ గిరి, హైదరాబాద్, చర్లపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు కొనసాగిస్తాయి.

⦿ మల్కాజ్‌గిరి స్టేషన్: 77656, 77653, 77654, 77655 (సికింద్రాబాద్-సిద్దిపేట రూట్లు) రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి.

⦿ హైదరాబాద్ దక్కన్ (నాంపల్లి): 12025/12026 (పుణె-సికింద్రాబాద్-పుణె) రైళ్లు ఈ టెర్మినల్ నుండి ఆపరేషన్స్ కొనసాగిస్తాయి.

⦿ చర్లపల్లి స్టేషన్: సికింద్రాబాద్–సిల్చార్ (12513/12514), సికింద్రాబాద్–దర్భంగా (17007/17008), సికింద్రాబాద్–యశ్వంత్‌పూర్ (12735/12736), సికింద్రాబాద్–అగర్తల (07030/07029), సికింద్రాబాద్–ముజఫర్‌పూర్ (05293/05294),   హైదరాబాద్–రక్సౌల్ (07051/07052) లాంటి సుదూర రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగిస్తాయి.

Read Also: కుండపోత వర్షాలు, రాష్ట్రంలో పలు రైళ్లు రద్దు!

రైళ్ల దారిమళ్లింపు నేపథ్యంలో ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక సూచనలు చేశారు. ఈ తాత్కాలిక ఏర్పాట్లను గమనించి, ఇందుకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరారు.

Read Also: కళ్లు చెదిరేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. నమ్మకపోతే ఈ వీడియో చూడండి!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×