BigTV English

Free Train Service: ఈ రైల్లో వెళ్లేందుకు టికెట్ అవసరం లేదు, 75 ఏండ్లుగా ఫ్రీ సర్వీస్ అందిస్తున్న ట్రైన్ గురించి మీకు తెలుసా?

Free Train Service: ఈ రైల్లో వెళ్లేందుకు టికెట్ అవసరం లేదు, 75 ఏండ్లుగా ఫ్రీ సర్వీస్ అందిస్తున్న ట్రైన్ గురించి మీకు తెలుసా?

Indian Railways: మనం సాధారణంగా రైలు ప్రయాణం చేస్తుంటాం. రైలు ఎక్కాలంటే కచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టికెట్ లేకుండా రైలు ఎక్కితే జరిమానా కట్టక తప్పదు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కానీ, దేశంలో ఓ రైల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇందులో ఎక్కాంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఈ రైలు ఎక్కడుంది? ఎందుకు ఉచితంగా ప్రయాణీకులను తీసుకెళ్లుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


75 వసంతాలుగా ఉచిత ప్రయాణం

ఉచిత ప్రయాణ సేవలను అందిస్తున్న ఈ రైలు హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ మధ్యలో నడుస్తున్నది. హిమాచల్ ప్రదేశ్ లోని భాక్రా, పంజాబ్ లోని నంగల్ మధ్య సుమారు 13 కిలో మీటర్ల మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ రైలు మొత్తం 6 స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు మూడు సొరంగ మార్గాల గుండూ పరుగులు తీస్తుంది. అద్భుతమైన ప్రకృతి అందాలను పరిచయం చేస్తుంది.


ఎందుకు ఈ రైలు ఉచితం ప్రయాణం అందిస్తుందంటే?

భాక్రా-నంగల్ రైలు 1948లో ప్రారంభించబడింది. దేశ స్వాతంత్ర్యం అనంతరం మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా భాక్రా-నంగల్ ప్రాజెక్టు నిర్మాణానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కార్మికులతో పాటు నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్లడంలో ఈ రైలు కీలక పాత్ర పోషించింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ ఈ రైలును అలాగే కొనసాగించారు. ప్రాజెక్టు పరిసర గ్రామ ప్రజలు, విద్యార్ధులు ఈ రైలు ద్వారా ప్రయాణించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రైలు ఉచితంగానే సర్వీసులు అందిస్తున్నది. రోజూ సుమారు 800 మందికి పైగా జనాలు ఈ రైల్లో ప్రయాణిస్తున్నారు. సట్లెజ్ నది, శివాలిక్ కొండల మీదుగా ఈ రైలు ప్రయాణం కొనసాగిస్తుంది.

Read Also: ఇండియాలో రైళ్లు ఎందుకు ఆలస్యంగా నడుస్తాయి? కారణాలు మీకు తెలుసా?

BBMB ఆధ్వర్యంలో రైలు నిర్వహణ

దేశంలోని అన్ని రైళ్లను భారతీయ రైల్వే నడిపిస్తుండగా, ఈ రైలును మాత్రం భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు(BBMB) నిర్వహిస్తుంది. 75 ఏండ్లుగా ఈ ఉచిత ప్రయాణ సేవను అందిస్తున్నది. ఈ రైలు నిర్వహణకు భారీగా ఖర్చు అవుతున్నప్పటికీ తన ఉచిత ప్రయాణ వారస్తత్వాన్ని కొనసాగిస్తున్నది. ఈ రైలు ప్రారంభించిన తొలినాళ్లలో స్ట్రీమ్ ఇంజిన్ ను ఉపయోగించే వాళ్లు. 1953లో డీజిల్ ఇంజిన్ ను తీసుకొచ్చారు. ప్రస్తుతం సరికొత్తగా రూపుదిద్దుకుంది. భాక్రా-నంగల్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చే పర్యాటకులు సైతం ఈ రైలులో ఉచితంగా ప్రయాణిస్తారు. ఈ రైలులో ఎవరైనా ప్రయాణించవచ్చు అంటున్నారు ప్రాజెక్టు అధికారులు. ఈ రైలులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా వెళ్లొచ్చు. ఈ రైలును ఎక్కువగా విద్యార్థులు, స్థానికులు ప్రయాణం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు.

Read Also: సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. పైన ప్యాసింజర్లు, మరి కింద?

Read Also: రైల్వేలో W/D బోర్డులు కనిపిస్తాయి.. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా?

Related News

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

×