E-Paper
Advertisement

వేసవిలో భూటాన్ ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి? ఖర్చు ఎంత?

వేసవిలో భూటాన్ ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి? ఖర్చు ఎంత?

Travel to Bhutan in 2026: వేసవిలో భూటాన్ పర్యటన జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని అందిస్తుంది.  జూన్ నుంచి ఆగస్టు వరకు అక్కడ వర్షాకాలం ఉంటుంది. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తుంటాయి. ఉదయాన్నే వెదర్ చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో కొండలు, లోయలు, వరి పొలాలు పచ్చగా అందంగా కనిపిస్తాయి.

తక్కువ ఉష్ణోగ్రతలు

భూటాన్ లో ఎండలు చాలా తక్కువగా ఉంటాయి. అస్సలు ఇబ్బంది పెట్టవు. థింపు, పారో లాంటి ఎత్తైన ప్రదేశాల్లో 15–25°C ఉష్ణోగ్రత ఉంటుంది. పునాఖా లాంటి పల్లపు ప్రాంతాల్లో 22–30°C వరకు వేడి ఉంటుంది. ఎక్కువగా తేమగా ఉంటుంది. వర్షం కారణంగా ప్రకృతి మరింత తాజాగా కనిపిస్తాయి. అయితే, కొన్నిసార్లు కొండచరియలు విరిగిపడే అవకాశమూ ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా టైగర్స్ నెస్ట్ వంటి ప్రదేశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలంటారు టూర్ గౌడ్స్.

భూటాన్ కు ఎలా వెళ్లాలంటే?

భారత్ నుంచి భూటాన్‌ కు వెళ్లడం చాలా సులభం. భారతీయులకు వీసా అవసరం లేదు. పాస్‌ పోర్ట్, ఓటర్ ఐడి కార్డు ఉంటే సరిపోతుంది. ఒక్కొక్కరికి రోజుకురూ.1,200 ఛార్జ్ చేస్తారు. విమాన ప్రయాణం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇండియా నుంచి భూటాన్ లోని పారో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఒకటే ఉంటుంది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుంచి ఢిల్లీ, కోల్‌ కతా మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవాలి. ప్రయాణ సమయం సుమారు 6–10 గంటలు పడుతుంది. రానుపోను టికెట్ ధర రూ. 20,000 నుంచి  రూ. 40,000 వరకు ఉంటుంది.   రోడ్డుమార్గం ఉన్నప్పటికీ, కాస్త ఇబ్బంది కరంగా ఉంటుంది.  బెంగాల్‌లోని జైగావ్ ద్వారా ఫుయెంటోలింగ్ సరిహద్దు దాటి భూటాన్‌ లోకి అడుగు పెట్టాలి. అక్కడి నుంచి థింఫు లేదంటే పారోకు 5–7 గంటలు ప్రయాణించాలి. వర్షాకాలంలో ఈ మార్గం అంతగా సౌకర్యవంతంగా ఉండవు.

వారం రోజుల టూర్ ప్లాన్ చేయడం మంచిది!

మొదటిసారి వెళ్లేవారు 5–7 రోజుల పర్యటన ప్లాన్ చేసుకోవడం మంచిది. పారోలో టైగర్స్ నెస్ట్ మఠానికి తప్పకుండా వెళ్లాలి. థింఫులో బుద్ధ డోర్డెన్మా విగ్రహం, తాషిచో జోంగ్ వంటి ప్రదేశాలు చూడవచ్చు. పునాఖాలో బ్యూటీఫుల్ పునాఖా జోంగ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయి. థింఫు నుంచి పునాఖాకు వెళ్తూ దోచులా పాస్ దగ్గర 108 చోర్టెన్‌ లు, హిమాలయాల మరింత అందాలు కనిపిస్తాయి.

ఎంత ఖర్చు అవుతుంది అంటే?

ఇక భూటాన్ వారం రోజుల పర్యటనకు సంబంధించి ఒక్కొక్కరికి సుమారు రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు ఖర్చవుతుంది. ఇందులో విమాన టికెట్లు, హోటల్, భోజనం, రవాణా, గైడ్ ఖర్చులు ఉంటాయి. గ్రూప్‌ గా వెళ్తే ఖర్చు కొంత తగ్గుతుంది. వేసవిలో హోటల్ డిస్కౌంట్లు కూడా లభిస్తాయి.

Read Also: ఏనుగుకు గులాబీ రంగు.. ఇండియాలో విదేశీ ఫొటోగ్రాఫర్ చేసిన పనికి అంత షాక్!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×