Bihar: దేశంలో రైళ్లు ఎందుకు తగలబడుతున్నాయి? అధికారుల పర్యవేక్షణ లోపమా? రోజుకు ఎక్కడో దగ్గర ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయా? షార్ట్ సర్క్యూట్ కారణమని చెప్పి అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది.
బీహార్లోని ఓ రైలులో అగ్నిప్రమాదం
బీహార్లోని ససారం రైల్వేస్టేషన్లో పాట్నా వెళ్తున్న ప్యాసింజర్ రైలు బోగీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రైలు బయలు దేరడానికి కొద్దిసేపటి ముందు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే వారిని ఆ బోగీల నుంచి కిందకు దించేవారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపులోని తీసుకొచ్చారు. అధికారుల ప్రాథమిక విచారణ మేరకు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ప్రయాణికులు సేఫ్.. ప్రమాదాలపై ప్రయాణికులు బెంబేలు
ససారం నుంచి పాట్నాకు కాసేపట్లో ఫాస్ట్ ప్యాసింజర్ రైలు బయలు దేరనుంది. స్టేషన్లోని ఆరో నెంబర్ ప్లాట్ఫాం వద్ద ఉండగా కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు అధికారులు.
ఆదివారం మధ్యప్రదేశ్లోని రత్లాంలో కేరళ నుంచి ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగి కొద్ది గంటల వ్యవధిలో మరొక ఘటన జరిగింది. ఇలా వరుసగా రైళ్లులో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఎండాకాలంలో ఏసీ బస్సుల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఉండేవి. ఇప్పుడు రైళ్లు వంతైంది.
ALSO READ: ఏంట్రా బాబూ ఈ వింత? చెట్లకు వేలాడే బొమ్మల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
బీహార్లోని ససారం రైల్వే స్టేషన్లో పాట్నా వెళ్తున్న ప్యాసింజర్ రైలు బోగీలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. రైలు బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం… pic.twitter.com/veeidASiyh
— ChotaNews App (@ChotaNewsApp) May 18, 2026