E-Paper
Advertisement

Indigo Effect: హైదరాబాద్ నుంచి విమాన టికెట్ ధర.. అక్షరాలా రూ.లక్ష!

Indigo Effect: హైదరాబాద్ నుంచి విమాన టికెట్ ధర.. అక్షరాలా రూ.లక్ష!

Hyd to Bhopal Flight Ticket 1.3 L: దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ అర్థరాత్రి వరకు విమానాల రద్దు కొనసాగుతుందని ప్రకటించింది. ఈ క్రైసిన్ ను ఇతర విమానయాన సంస్థలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రద్దీగా ఉన్న మార్గాల్లో విమాన టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. హైదరాబాద్ నుంచి భోపాల్‌కు ఎయిర్ ఇండియా టికెట్ ధర ఏకంగా రూ.1.3 లక్షలు పలికింది. ఈ ఛార్జీతో కేవలం ఒకే సీటు అందుబాటులో ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, భోపాల్ లాంటి ముఖ్య నగరాలకు వెళ్లే ఇండిగో సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఎయిర్‌ లైన్ వెబ్‌ సైట్లు,  ట్రావెల్ పోర్టల్స్ లో విమానాల టికెట్ ఛార్జీలు భారీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పలు నగరాలకు పెద్ద సంఖ్యలో విమానాలు నడుపుతున్న ఇండిగో.. అన్ని విమానాలను రద్దు చేయడంతో తీవ్ర సంక్షోభం తలెత్తింది.

హైదరాబాద్-విశాఖ విమాన టికెట్ ఛార్జీలు

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మార్గంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఒకే ఒక విమానం అందుబాటులో ఉంది. ముంబై,  బెంగళూరు ద్వారా టూ స్టాప్‌ల సర్వీసుకు తొమ్మిది గంటల ప్రయాణ సమయం పడుతుంది. ఎకానమీ ఛార్జీ రూ.69,787గా ఉంది. భువనేశ్వర్‌ కు, తొమ్మిది గంటల వన్ స్టాప్ ప్రయాణానికి స్వల్పంగా రూ.27,417గా ఉంది. హైదరాబాద్-విజయవాడ టికెట్ ధర రూ.28 వేలు ఉంది.

హైదరాబాద్-ఢిల్లీ విమాన టికెట్ ఛార్జీలు

ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు నాన్ స్టాప్ విమాన టికెట్ ధర రూ.12,894గా ఉంది. అత్యంత ఖరీదైన నాన్ స్టాప్ టికెట్ ధర రూ.   29,524గా ఉంది. ముంబై సెక్టార్‌లో 12 గంటల టూ స్టాప్ సర్వీస్‌కు తక్కువ టికెట్ ధర రూ. 32,095గా ఉండగా, ఐదు గంటల వన్ స్టాప్ విమాన టికెట్ ధర రూ. 59,482గా ఉంది.  అదే మార్గంలో మరో వన్ స్టాప్ విమాన టికెట్ ధర రూ.  70,329కి చేరుకుంది. ఒకానొక సమయంలో హైదరాబాద్‌-ఢిల్లీ విమాన టికెట్‌ ధర రూ. రూ.89 వేలకు చేరింది. ఢిల్లీ-ముంబై విమాన టికెట్ ధర రూ.40 వేలకు చేరింది.

Read Also: ప్రయాణీకులకు ఇండిగో క్షమాపణలు, రీఫండ్ పై కీలక ప్రకటన!

ఇవాళ అర్థరాత్రి వరకు విమాన సర్వీసులు అందుబాటులో ఉండవని ఇండిగో ప్రకటించిన నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రద్దీ రూట్లలో గంట గంటకు పెరుగుతున్నాయి. మూడు రోజులుగా ప్రయాణీకులు విమానాశ్రయాలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకుల అత్యవసర ప్రయాణాలను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ధరల నియంత్రణ విషయంలో చేతులెత్తేసింది.

Read Also: ఇండిగో ఇబ్బందుల దృష్ట్యా DGCA కీలక నిర్ణయం.. ఆ నిబంధనల్లో మార్పులు!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×