E-Paper
Advertisement

రైలు మీదకి ఫుడ్ ప్యాకెట్ విసిరిన ప్రయాణికుడు, అసిస్టెంట్ లోకో పైలట్‌ కు తీవ్ర గాయాలు!

రైలు మీదకి ఫుడ్ ప్యాకెట్ విసిరిన ప్రయాణికుడు, అసిస్టెంట్ లోకో పైలట్‌ కు తీవ్ర గాయాలు!
Advertisement

Assistant Loco Pilot Injured: చిన్న ఫుడ్ ప్యాకెట్ వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చింది.  ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ డివిజన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న రైలు నుంచి విసిరిన ఫుడ్ ప్యాకెట్ మరో రైలు ఇంజిన్‌ ను బలంగా తాకడంతో లుక్‌ అవుట్ గ్లాస్ పగిలిపోయి, అసిస్టెంట్ లోకో పైలట్ గాయపడ్డారు. ఈ ఘటనతో కొంతసేపు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు కూడా ఆందోళనకు గురయ్యారు.

అర్థరాత్రి సమయంలో ఘటన

ఈ ఇన్సిడెంట్ జూన్ 3, 4 తేదీల మధ్య రాత్రి సింగరాయకొండ, ఉలవపాడు రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. న్యూఢిల్లీ నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్తున్న 12616 గ్రాంట్ ట్రంక్ సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్ వేగంగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  ఎదురుగా వస్తున్న ఎర్నాకులం-బిలాస్‌ పూర్ సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్‌ లోని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫుడ్ ప్యాకెట్‌ ను బయటకు విసిరినట్లు తెలుస్తోంది. ఆ ప్యాకెట్ వేగంగా ప్రయాణిస్తున్న గ్రాంట్ ట్రంక్ ఎక్స్‌ ప్రెస్ ఇంజిన్‌ ను తాకింది. దీంతో ఇంజిన్ ముందు భాగంలో ఉన్న లుక్‌ అవుట్ గ్లాస్ పగిలిపోయింది.

అసిస్టెంట్ లోకో పైలెట్ కు తీవ్ర గాయాలు

Advertisement

గాజు ముక్కలు ఎగిరిపడటంతో అసిస్టెంట్ లోకో పైలట్ ఎం. జయరామ్‌ కు గాయాలయ్యాయి. ఆయనకు రక్తస్రావం కావడంతో వెంటనే రైలును అత్యవసర బ్రేకులతో నిలిపివేశారు. అనంతరం రైల్వే సిబ్బంది అంబులెన్స్‌ కు సమాచారం ఇచ్చి గాయపడిన సిబ్బందిని సమీప ఆసుపత్రికి తరలించారు.

https://twitter.com/sanatan_kannada/status/2062871678506721319

దర్యాప్తు ప్రారంభించిన అధికారులు

Advertisement

ఘటన తర్వాత రైల్వే అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. రెండు రైళ్ల సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో గ్రాంట్ ట్రంక్ ఎక్స్‌ ప్రెస్ గంటకు 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. రెండు రైళ్లు అధిక వేగంతో ఎదురెదురుగా వెళ్తున్న సమయంలో విసిరిన వస్తువు తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు ఇంజిన్ సమీపంలో ఆహార పదార్థాల అవశేషాలు, రక్తపు మరకలను గుర్తించినట్లు సమాచారం. అయితే ఘటనకు సంబంధించి స్పష్టమైన సీసీటీవీ ఆధారాలు లభించలేదని తెలుస్తోంది.

ఈ ఘటనపై ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (AILRSA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రైళ్ల నుంచి వస్తువులు బయటకు విసరడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి నిరూపించిందని సంఘం తెలిపింది. రైల్వే సిబ్బంది భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రయాణికుల్లో అవగాహన పెంచాలని కోరింది.

Read Also: భారీ శబ్దంతో చీలిపోయిన రైలు బోగి.. భయంతో ప్రయాణికుల పరుగులు!

Related News

సిరిసిల్ల జిల్లాలో మ‌రో పుణ్య‌క్షేత్రం..500 అడుగుల స‌ర్పం..ఏకంగా 5 త‌ల‌లు

ఆ దేశంలో గాజుతో రైలు నిర్మాణం చేసిన ఇంజినీర్లు.. దీనికి ప్రత్యేక కారణం మ్యాజిక్

ముస్లింలకు శుభవార్త.. ఒక్క ఉమ్రా వీసాతో ఎన్నిసార్లైనా మక్కా ఎంట్రీ.. కానీ చిన్న కండీషన్

పాత బంగ్లాలో అర్ధరాత్రి విడిది.. దెయ్యం లేదని నిరూపిస్తే.. రూ.52 వేలు మీవే!

Gulf Job Scam: విజిట్ వీసా vs వర్క్ వీసా.. ఈ ఒక్క తప్పు చేస్తే గల్ఫ్‌లో జీవితం నాశనమే!

సహారా ఎడారి లేకపోతే అమెజాన్ అడవి ఉండేది కాదా? రెండింటి మధ్య అసలు లింకేంటి?

ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు ఇండియాలో.. ఈ అందమైన గ్రామం గురించి మీకు తెలుసా?

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!

Big Stories

Advertisement
×