E-Paper
Advertisement

Bird Sanctuary: పక్షులంటే ఇష్టమా? అయితే ఈ టూరిస్ట్ స్పాట్‌కు పక్కా వెళ్లాలి..

Bird Sanctuary: పక్షులంటే ఇష్టమా? అయితే ఈ టూరిస్ట్ స్పాట్‌కు పక్కా వెళ్లాలి..
Advertisement

Bird Sanctuary: పక్షుల పట్ల ఆసక్తి ఉన్నవారు వలస పక్షుల అందమైన దృశ్యాలను చూసేందుకు చాలా ఇష్టపడతారు. ఇతర దేశాల్లో ఉండే పక్షులను చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ, వాటిని చూడాలంటే ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుందని అనుకుంటారు. అయితే ఏపీకే వలస పక్షులు వస్తాయని తెలిసిన వారు చాలా అరుదుగా ఉంటారు. అక్కడికి ఇతర దేశాల నుంచి కూడా పక్షులు వలస వస్తాయి. ఆ ప్రదేశం ఎక్కడుందంటే..

తేలినీలాపురం, ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో ఉన్న ఒక చిన్న గ్రామం, వలస పక్షుల సంరక్షణ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం పక్షి ప్రేమికులకు, పర్యాటకులకు ఒక అద్భుతమైన గమ్యస్థానంగా చెప్పుకోవచ్చు.

Advertisement

వలస పక్షులు
తేలినీలాపురం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి మార్చి వరకు సైబీరియా, బంగ్లాదేశ్, ఇతర దేశాల నుండి వచ్చే సుమారు 3000 పెలికాన్ లు, పెయింటెడ్ స్టార్క్ ల ఆవాస స్థలంగా ఉంటుంది. ఈ పక్షులు శీతాకాలంలో ఆహారం, సంతానోత్పత్తి కోసం ఇక్కడకు వలస వస్తాయి. అక్టోబర్ లో వచ్చిన పక్షులు గూళ్లు కట్టడం, జతకట్టడం, డిసెంబర్ నాటికి పిల్లలను పొదిగి వాటికి ఈత, ఎగరడం నేర్పిస్తాయి. ఈ దృశ్యాలు పక్షి ప్రేమికులకు, పర్యాటకులకు అద్భుతమైన అనుభవాన్ని కలిగిస్తాయి. గతంలో 10,000 కు పైగా పక్షులు వచ్చేవని ఆంధ్రా యూనివర్సిటీ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి, కానీ పర్యావరణ మార్పుల వల్ల క్రమంగా ఈ సంఖ్య తగ్గింది.

టూరిస్ట్ స్పాట్
తేలినీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం సుమారు 458 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ కొలను చుట్టూ బేరింగ్టోనియా చెట్లు, దక్షిణ శుష్క ఆకురాలని పొదలు పక్షులకు సహజ ఆవాసాన్ని కల్పిస్తాయి. పెలికాన్ లు, స్టార్కులతో పాటు, ఇతర అరుదైన పక్షులను కూడా ఇక్కడ చూడవచ్చు. సందర్శకుల కోసం చిన్న మ్యూజియం, గైడెడ్ టూర్లు, బోటింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయ్. అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్య కాలంలో పక్షుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండడంవల్ల ఇది ఉత్తమ సందర్శన సమయంగా చెప్పుకోవచ్చు.

Advertisement

తేలినీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం ప్రకృతి, పక్షి ప్రేమికులకు, పర్యాటకులకు ఒక అద్భుతమైన గమ్యస్థానం అని చెప్పొచ్చు. సైబీరియా నుండి వచ్చే వలస పక్షుల అందమైన దృశ్యాలు, సులభమైన రవాణా సౌకర్యాలు, పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసే ఈ స్థలం పర్యాటకులకు మరపురాని అనుభవాన్ని అందిస్తుంది.

ఎలా వెళ్లాలి?
తేలినీలాపురం శ్రీకాకుళం నుండి 65 కి.మీ. విశాఖపట్నం నుండి 135 కి.మీ. దూరంలో ఉంది. రైలు మార్గంలో, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో ఉంది, ఇక్కడ నుండి ఆటో లేదా టాక్సీల ద్వారా 10-15 కి.మీ. ప్రయాణించి రోడ్డు మార్గంలో, విశాఖపట్నం లేదా శ్రీకాకుళం నుండి బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా సులభంగా వెళ్లొచ్చు.

Related News

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

Big Stories

Advertisement
×