హైదరాబాద్ మెట్రో రైళ్ల టైమింగ్స్ మార్చుతున్నట్లు ఎల్ అండ్ టీ ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. సవరించిన మెట్రో టైమింగ్స్ నవంబర్ 3, 2025 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం వారంలో మూడు రకాల టైమింగ్స్ ప్రకారం రైళ్లు నడుస్తుండగా, ఇకపై వారంలోని అన్ని రోజులు ఒకే టైమింగ్స్ ఫాలో కానున్నట్లు వెల్లడించింది. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ఒకేలా ఉంటాయని తెలిపింది. ఉదయం 6:00 నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమై, రాత్రి 11:00 గంటల వరకు కొనసాగుతాయని తెలిపింది. ప్రయాణీకులు ఈ టైమింగ్స్ ప్రకారం తమ రాకపోకలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటన జారీ చేసింది.
Revised Metro Timings | Effective 03 Nov 2025
Metro services will now run from 6:00 AM to 11:00 PM from all terminal stations on all days of the week
We request passengers to plan their travel accordingly.
Thank you for your cooperation.
[Hyderabad Metro, L&T Hyderabad… pic.twitter.com/BJlsnUSnIw
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) November 1, 2025
Read Also: రైలులో లోయర్ బెర్త్ కావాలా? మారిన ఈ రూల్స్ గురించి ముందుగా తెలుసుకోవల్సిందే!
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైళ్లు మూడు రకాల టైమింగ్స్ ను ఫాలో అవుతున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మొదటి రైలు ఉదయం 6:00 గంటలకు ప్రారంభమై.. చివరి రైలు రాత్రి 11:45 గంటల వరకు నడుస్తుంది. శనివారం నాడు మొదటి రైలు ఉదయం 6:00 గంటలకు ప్రారంభమై, చివరి రైలు రాత్రి 11:00 గంటలకు వరకు నడుస్తుంది. ఆదివారం నాడు మొదటి రైలు ఉదయం 7:00 గంటలకు ప్రారంభం కాగా, చివరి రైలు రాత్రి 11:00 గంటలకు నడుస్తుంది. ఇకపై వారం రోజులు ఒకేలా టైమింగ్స్ ఉంటాయని హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది.
Read Also: విమానాలకు ఎడమ వైపే ఎంట్రీ ఎందుకు ఉంటుంది? కుడి వైపు డోర్ ఎందుకు ఉండదు? కారణం ఇదేనట!