E-Paper
Advertisement

Hyd Metro Timings: కోచ్ లు పెంచకపోగా ఉన్న టైమ్ తగ్గిస్తారా? హైదరాబాద్ మెట్రోపై ప్రయాణీకుల ఆగ్రహం!

Hyd Metro Timings: కోచ్ లు పెంచకపోగా ఉన్న టైమ్ తగ్గిస్తారా? హైదరాబాద్ మెట్రోపై ప్రయాణీకుల ఆగ్రహం!

Revised Hyd Metro Timings:

హైదరబాద్ మెట్రో ఆపరేషనల్ టైమింగ్స్ మార్చుతూ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మెట్రో రైళ్ల కోచ్ లు పెంచాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తుండగా, వాటిని పెంచకపోగా, ఇప్పుడు ఉన్న సమయాన్ని తగ్గించడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఆఫీసుల నుంచి రాత్రి 11.00 గంటల తర్వాతే బయటకు వస్తారు. ఇప్పటి వరకు చివరి రైళ్లు 11.45 వరకు నడవడంతో హ్యాపీగా వెళ్లేవారు. కానీ, రాత్రి 11 గంటల వరకే నడిపిస్తామని మెట్రో ప్రకటించడంతో చాలా మంది ఐటీ ఉద్యోగల ప్రయాణాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఆపరేషనల్ ఖర్చులు తగ్గించుకునేందుకు మెట్రో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, చాలా మంది ప్రయాణీకుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది.

వీకెండ్ ప్రయాణీకులపైనా ఎఫెక్ట్

అటు వీకెండ్స్ లో చాలా మంది ఉద్యోగులు బయటకు వెళ్తారు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో టైమ్ స్పెండ్ చేస్తారు. ఇన్నాళ్లు వాళ్లు కూడా మెట్రో రైళ్లను తమ ప్రయాణాల కోసం ఉపయోగించేవారు. కానీ, తాజా నిర్ణయం వారి మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. రాత్రి సమయంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా కోచ్ ల సంఖ్య పెంచాల్సిందిపోయి.. ఉన్న సమయాన్ని తగ్గించడం ఏంటని పలువు ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు. “ ఇదేంటి??.. వీకెండ్ ప్రయాణీకులకు అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు బెస్ట్ ఆప్షన్. రాత్రి 11:00 గంటలకు కాదు, రాత్రి 11:45 గంటలకు బయలుదేరే చివరి రైళ్లకు అందరం అలవాటు పడ్డాము. ఫస్ట్ మీరు కోచ్ ల సంఖ్య పెంచాలి. కానీ, ఎప్పుడూ పెంచలేదు. ఇప్పుడు ఉన్న సమయాలను కూడా కూడా తగ్గిస్తున్నారా? నిజంగా సిగ్గు చేటు” అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  “మెట్రో కోచ్ లను పెంచడంతో పాటు రద్దీ సమయంలో రైళ్ల ఫ్రీక్వెన్సీని 5 నిమిషాల నుంచి 3 నిమిషాలకు తగ్గించాలి” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

మెట్రో రైళ్ల టైమింగ్స్ లో మార్పులు

తాజాగా హైదరాబాద్ మెట్రో రైళ్ల టైమింగ్స్ మార్చుతున్నట్లు ఎల్ అండ్ టీ ప్రకటించింది. సవరించిన మెట్రో టైమింగ్స్ నవంబర్ 3 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.  ప్రస్తుతం వారంలో మూడు రకాల టైమింగ్స్ ప్రకారం రైళ్లు నడుస్తుండగా, ఇకపై వారంలోని అన్ని రోజులు ఒకే టైమింగ్స్ ఫాలో కానున్నట్లు వెల్లడించింది. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ఒకేలా ఉంటాయని తెలిపింది. ఉదయం 6:00 నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమై, రాత్రి 11:00 గంటల వరకు కొనసాగుతాయని తెలిపింది. ప్రయాణీకులు ఈ టైమింగ్స్ ప్రకారం తమ రాకపోకలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో మూడు రకాల టైమింగ్స్ ను ఫాలో అవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మొదటి రైలు ఉదయం 6:00 గంటలకు ప్రారంభమై.. చివరి రైలు రాత్రి 11:45 గంటల వరకు నడుస్తుంది. శనివారం నాడు మొదటి రైలు ఉదయం 6:00 గంటలకు ప్రారంభమై, చివరి రైలు రాత్రి 11:00 గంటలకు వరకు నడుస్తుంది. ఆదివారం నాడు మొదటి రైలు ఉదయం 7:00 గంటలకు ప్రారంభం కాగా, చివరి రైలు రాత్రి 11:00 గంటలకు నడుస్తుంది. ఇకపై వారం రోజులు ఒకేలా టైమింగ్స్ ఉంటాయని హైదరాబాద్ మెట్రో ప్రకటించింది.

Read Also:  రైల్వే టికెట్లు బుక్ చెయ్యడం కష్టమే.. ఎప్పటి వరకు అంటే?

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×