E-Paper
Advertisement

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!
Advertisement

Affordable Stay at Railway Stations: తరచుగా రైల్వే స్టేషన్ కు వెళ్లిన తర్వాత ట్రైన్ ఆలస్యం అనే మాట వింటుంటాం. అలాంటి సమయంలో ప్లాట్ ఫారమ్ మీదే గంటల తరబడి వెయిట్ చేయాల్సి రావచ్చు. చాలా మంది  రైలు కోసం గంటల తరబడి స్టేషన్‌ లో వేచి ఉండాల్సి వచ్చిన సందర్భాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ప్లాట్‌ ఫారమ్‌ మీద  కూర్చోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రైలు ఆలస్యం అయితే  ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. అయితే, చాలా మంది ప్రయాణికులకు తెలియని ఓ ఉపయోగకరమైన సదుపాయం భారతీయ రైల్వే అందిస్తోంది. అదే ఐఆర్‌సీటీసీ రిటైరింగ్ రూమ్స్.

ఇంతకీ ఐఆర్‌సీటీసీ రిటైరింగ్ రూమ్స్ అంటే ఏంటి?

రిటైరింగ్ రూమ్స్ అనేవి రైల్వే స్టేషన్లలోనే అందుబాటులో ఉంటాయి. ఈ గదులను ప్రయాణికులు తక్కువ ఖర్చుతో బుక్ చేసుకుని రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణం చేసే వారికి ఇది ఎంతో ఉపయోగపడే సౌకర్యం. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ప్రయాణించే వారు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నవారికి ఈ సదుపాయం మరింత సౌకర్యంగా ఉంటుంది.

జస్ట్ రూ. 200కే ఏసీ రూమ్

Advertisement

రిటైరింగ్ రూమ్స్‌ లో సాధారణ గదులతో పాటు ఏసీ గదులు, డార్మిటరీలు కూడా అందుబాటులో ఉంటాయి. డార్మిటరీ బెడ్స్ సాధారణంగా రూ.100 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే , గదులు సుమారు రూ.200 నుంచి లభిస్తాయి. స్టేషన్, రూమ్ మోడల్, డిమాండ్‌ ను బట్టి ధరల్లో కొంత మార్పు ఉంటుంది.

12 గంటల నుంచి 2 రోజుల వరకు బుక్ చేసుకోచ్చు!

ఈ గదులను 12 గంటల నుంచి గరిష్టంగా రెండు రోజుల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కన్ఫర్మ్ అయిన టికెట్, ఆర్‌ఏసీ టికెట్ ఉన్న ప్రయాణికులు మాత్రమే ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌ సైట్, యాప్ ద్వారా సులభంగా ఆన్‌ లైన్‌ లో బుకింగ్ చేసుకోవచ్చు. రాత్రి సమయంలో రైలు ఆలస్యం అయినా, తెల్లవారుజామున రైలు ఉన్నా, మధ్యలో కొన్ని గంటలు విశ్రాంతి అవసరమైనా ఈ గదులు బుక్ చేసుకోవడం మంచిది. స్టేషన్ బయట హోటల్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. అలాగే అదనపు ఖర్చు కూడా తగ్గుతుంది.

Advertisement

వాస్తవానికి చాలా మంది ప్రయాణికులు ఈ సదుపాయం గురించి తెలియక ప్లాట్‌ ఫారమ్‌ పై గంటల తరబడి వేచి ఉంటారు. కానీ, ముందుగానే రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకుంటే సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో, ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్లే రైలు ఆలస్యం అయినప్పుడు, స్టేషన్‌లో ఎక్కువ సమయం గడపాల్సి వచ్చినప్పుడు ప్లాట్‌ ఫారమ్‌ మీద ఇబ్బంది పడకుండా రైల్వే రిటైరింగ్ రూమ్స్‌ ను వాడుకోవడం మంచిది. తక్కువ ఖర్చుతో మంచి సౌకర్యాన్ని పొందుతూ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు.

Read Also: కన్ఫర్మ్ టిక్కెట్ ఉన్నా నో సీట్.. రైల్వేకు దిమ్మతిరిగే షాకిచ్చిన వినియోగదారుల కమిషన్!

Related News

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

జూలైలో పర్యటించడానికి 6 అందమైన ప్రదేశాలు.. చల్లని, స్వచ్ఛమైన గాలితో మైమరిపించే వాతావరణం

Big Stories

Advertisement
×