E-Paper
Advertisement

కాకినాడ నుంచి మైసూరుకు డైరెక్ట్ ట్రైన్.. ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

కాకినాడ నుంచి మైసూరుకు డైరెక్ట్ ట్రైన్.. ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

Kakinada-Mysuru Train Service Starts: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కాకినాడ నుంచి  కొత్త రైల్వే సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా కాకినాడ– మైసూర్ మధ్య నేరుగా నడిచే రైలు సర్వీసును తాజాగా ప్రారంభించింది. ఈ రైలుకు 17289 అనే నంబర్‌ను కేటాయించారు అధికారులు. ఈ రైలును కాకినాడ లోక్‌సభ సభ్యుడు  టి. ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు.

ఉదయం 9 గంటలకు కాకినాడ నుంచి ప్రారంభం

ఈ రైలు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరుతుంది. రాజమండ్రి, తణుకు, భీమవరం, గుడివాడ, విజయవాడ లాంటి ముఖ్య నగరాల మీదుగా ఈ ప్రయాణం కొనసాగుతుంది. మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మైసూరు చేరుకుంటుంది. దీని ద్వారా ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభమైంది.

నెరవేరిన కాకినాడ ప్రజల చిరకాల కోరిక

ఈ రైలు సర్వీసు ప్రారంభంతో కాకినాడ, పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. మైసూరుకు నేరుగా వెళ్లే సౌకర్యం లేకపోవడం వల్ల ఇంత వరకు ప్రయాణికులు మధ్యలో రైళ్లు మార్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే రైలులో సౌకర్యంగా ప్రయాణించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారాలు చేసుకునేవారితో పాటు యాత్రికులకు  ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

రైల్వేమంత్రికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ధన్యవాదాలు

అటు ఈ రైలు సర్వీసు ప్రారంభం సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కేంద్రం రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు చెప్పారు. ఈ రైలు సర్వీసు వాణిజ్య, విద్య, పర్యాటక రంగాలకు మేలు చేస్తుందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయన్నారు. ఈ రైలు మంజూరు కోసం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు పలుమార్లు వినతి పత్రాలు అందించినట్లు చెప్పారు. ఈ సర్వీసును ఆమోదించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

సంతోషం వ్యక్తం చేసిన గోదావరి రైల్వే ప్రయాణికుల సంఘం

ఇక గోదావరి జిల్లా రైల్వే ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. తమ అభ్యర్థనకు త్వరగా స్పందించి ఈ రైలును ప్రారంభించినందుకు ఎంపీతో పాటు రైల్వే అధికారులకు సంఘం అధ్యక్షుడు గట్టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి డి.ఎన్. రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కొత్త రైలు సర్వీసు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే కీలక అడుగుగా భావిస్తున్నారు. ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా, ఆర్థిక కార్యకలాపాలను కూడా పెంచే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: జమ్మూ నుంచి శ్రీనగర్‌ కు డైరెక్ట్ ట్రైన్.. దశాబ్దాల కల సాకారం!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×