E-Paper
Advertisement

Sahasralinga: శివరాత్రి సమయంలోనే కనిపించే లింగాలు..! ఆ ప్రదేశం అంత శక్తివంతమైనదా..?

Sahasralinga: శివరాత్రి సమయంలోనే కనిపించే లింగాలు..! ఆ ప్రదేశం అంత శక్తివంతమైనదా..?
Advertisement

Sahasralinga: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో సిర్సీకి 14 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ కనుమల్లో దాగిన సహస్రలింగం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం. షల్మలా నది ఒడ్డున రాళ్లపై చెక్కిన వేలాది శివలింగాలతో ఈ ప్రదేశం భక్తులు, చరిత్ర ప్రియులు, పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మహాశివరాత్రి రాగానే ఇక్కడ భక్తుల సందడి మొదలవుతుంది.

నదిలో కనిపించే శివలింగాలు
సహస్రలింగం అంటే ‘వెయ్యి లింగాలు’ అని అర్థం. ఫిబ్రవరిలో షల్మలా నదిలో నీళ్లు తగ్గినప్పుడు, రాళ్లపై చెక్కిన శివలింగాలు స్పష్టంగా కనిపిస్తాయి. చిన్నవి, పెద్దవి అని తేడా లేకుండా ఈ లింగాలతో పాటు గణేశుడు, నంది వంటి దేవతల చెక్కడాలు కూడా ఉన్నాయి. దట్టమైన అడవులు, నది శబ్దం మధ్య ఈ ప్రదేశం ఒక పవిత్రమైన ఫీల్ ఇస్తుంది. మహాశివరాత్రి సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడ పూజలు చేయడానికి వస్తారు.

Advertisement

మనుషులు చేసిందా, దైవం సృష్టించిందా?
సహస్రలింగాల మూలం గురించి చరిత్రకారులు ఒకటి చెబితే, స్థానికుల కథలు మరొకటి చెబుతాయి. చరిత్ర ప్రకారం, 1678-1718 మధ్య విజయనగర రాజు సదాశివరాయ ఈ శివలింగాలను చెక్కించాడట. శివభక్తుడైన ఆయన తన రాజ్యం బాగుండాలని ఈ లింగాలను నిర్మించాడని చెబుతారు. సుమారు 8 కిలోమీటర్ల పొడవునా ఈ లింగాలు వ్యాపించి ఉన్నాయి, మొత్తం వెయ్యికి పైగా ఉండొచ్చని అంచనా.

కానీ, స్థానిక కథల్లో ఇది దైవికమని చెప్పుకుంటారు. మహాభారతంలో భీముడు, హనుమంతుడి తోక జుట్టు నుంచి ఈ లింగాలు వచ్చాయని ఒక కథ. ఇంకో నమ్మకం ప్రకారం, సమీపంలోని ఉప్పినంగడిలో ఫిబ్రవరిలో, అంటే మహాశివరాత్రి సమయంలో మాత్రమే కనిపించే కొన్ని లింగాలు సహజంగా ఏర్పడ్డాయని అంటారు. ఈ కథలు ఈ ప్రదేశాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తాయి. ఈ లింగాలు శివరాత్రి సమయంలో మాత్రమే కనిపించడానికి కారణం ఏంటనేది ఇంకా పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది.

Advertisement

చరిత్రకారులు మాత్రం ఇవి మనుషులు చెక్కినవేనని, విజయనగర కాలంలోని కళా నైపుణ్యానికి ఉదాహరణ అని చెబుతారు. అయినా, ఈ లింగాలు ఎందుకు చెక్కారన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉండిపోయింది. కొందరు ఇక్కడ పురాతన ఆచారాలు జరిగేవని, మరికొందరు ఇది రాజు భక్తికి చిహ్నమని అంటారు.

ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద
సహస్రలింగం కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, కర్ణాటక, విజయనగర కళా వారసత్వానికి ఒక నిధి. కంబోడియాలోని క్బల్ స్పీన్‌లో కూడా ఇలాంటి వెయ్యి లింగాలు ఉన్నాయి. ఇది హిందూ సంస్కృతి విస్తృతిని చూపిస్తుంది. కానీ అక్కడ పర్యాటక ఆకర్షణగా ఉంటే, సహస్రలింగం ఇప్పటికీ జీవంతో ఉన్న పుణ్యక్షేత్రం.

ఏడాది పొడవునా ఇక్కడ సందర్శకులు వస్తుంటారు. కానీ, ఫిబ్రవరిలో లింగాలు స్పష్టంగా కనిపించే సమయం బెస్ట్. ఈ ప్రదేశ పవిత్రతను కాపాడాలని భక్తులు, పర్యాటకులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి క్షేత్రాలకు ముప్పు ఉందని, సహస్రలింగాన్ని రక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు.

శివరాత్రి సందడి
మహాశివరాత్రి సమయంలో సహస్రలింగం భక్తులతో కళకళలాడుతుంది. ఈ శివలింగాలు మనుషులు చెక్కినవైనా, దైవం సృష్టించినవైనా, షల్మలా నది ఒడ్డున అవి సృష్టించే ఆధ్యాత్మిక వైబ్ అద్భుతం. భక్తులకు శివుడితో దగ్గరవ్వడానికి, చరిత్రకారులకు పురాతన కళను ఆరాధించడానికి, పర్యాటకులకు కర్ణాటక ఆధ్యాత్మిక సౌందర్యాన్ని చూడడానికి ఇది ఒక గొప్ప అవకాశం.

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×