E-Paper
Advertisement

తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఇక గోవాకు ఈజీగా వెళ్లొచ్చు!

తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఇక గోవాకు ఈజీగా వెళ్లొచ్చు!
Advertisement

Vikarabad to Krishna Rail Line: తెలంగాణలో పెద్ద రైల్వే ప్రాజెక్ట్ రాబోతోంది. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న ఈ రైల్వే ప్రాజెక్ట్ అమలులోకి వస్తే, గోవాకు వెళ్లే ప్రయాణం మరింత సులభం కానుంది. వికారాబాద్- కృష్ణా పేరుతో కొత్త రైల్వే లైన్ నిర్మించాలనే రైల్వేశాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇది పూర్తయితే ప్రయాణికులకు కొత్త మార్గం అందుబాటులోకి వస్తుంది.

రూ. 2,844 కోట్లు.. 122 కిలో మీటర్లు..

ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు సుమారు రూ. 2,844 కోట్లు అవుతుందని అంచనా. దాదాపు 122 కిలోమీటర్ల పొడవుతో కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం జరగనుంది. ఆర్థిక పరంగా కూడా లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు.  కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా, ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడే ప్రాజెక్ట్‌ గా భావిస్తున్నారు.

ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుందంటే..

Advertisement

ఈ కొత్త రైల్వే మార్గం ద్వారా నారాయణపేట్, రాయ్ చూర్, హుబ్లి మీదుగా గోవాకు చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతాల మధ్య ప్రయాణం కొంత కష్టంగా ఉండగా, ఈ కొత్త మార్గం వల్ల ప్రయాణ సమయం తగ్గి, సౌకర్యం పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలకు మంచి ప్రయోజనం కలగనుంది. రైల్వే లైన్ ఏర్పడితే అక్కడి ప్రజలకు ప్రయాణ సౌకర్యం మాత్రమే కాకుండా, వాణిజ్య కార్యకలాపాలు కూడా పెరిగే అవకాశం ఉంది. చిన్న పట్టణాలు, గ్రామాలు కూడా రైల్వే నెట్‌ వర్క్‌ తో కలవడం వల్ల అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయి.

అటు పరిశ్రమల అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. కొత్త రైల్వే లైన్ వల్ల సరుకు రవాణా సులభమవుతుంది. పెట్టుబడిదారులు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. పరిశ్రమలు పెరిగితే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఆ ప్రాంతాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే!

Advertisement

ఈ ప్రాజెక్ట్‌ లో ముఖ్య అంశం భూసేకరణ. దీనికి సంబంధించిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగేందుకు సాయపడనుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన రైల్వే బోర్డు దగ్గర పరిశీలనలో ఉంది. అన్ని అనుమతులు లభించిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గోవాకు వెళ్లే వారికి ఇది కొత్త మార్గాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న మార్గాలతో పోలిస్తే ఇది సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది. పర్యాటక రంగానికి కూడా ఇది మేలు చేస్తుంది, ఎందుకంటే గోవా వంటి ప్రముఖ టూరిస్ట్ ప్రదేశానికి చేరుకోవడం మరింత సులభమవుతుంది. వికారాబాద్ – కృష్ణా కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ తెలంగాణ రవాణా రంగంలో కీలక మార్పుకు కారణం కానుంది. ఇది అమలులోకి వస్తే, ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది.

Read Also: అనకాపల్లి–చర్లపల్లి కొత్త ఎక్స్‌ ప్రెస్ రైలు ప్రారంభం, ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×