E-Paper
Advertisement

అనకాపల్లి–చర్లపల్లి కొత్త ఎక్స్‌ ప్రెస్ రైలు ప్రారంభం, ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

అనకాపల్లి–చర్లపల్లి కొత్త ఎక్స్‌ ప్రెస్ రైలు ప్రారంభం, ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
Advertisement

Anakapalli- Cherlapally Train: ఏపీకి రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ లోని అనకాపల్లి నుంచి కొత్త రైలు సర్వీసు ప్రారంభం అయ్యింది. ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ ను రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, అనకాపల్లి ఎంపీ సి ఎం. రమేష్ జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్‌ లో ఈ ప్రారంభోత్సవం కొనసాగుతోంది. చాలా కాలంగా ఉన్న ఈ డిమాండ్ నిజం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అనకాపల్లి- చర్లపల్లి మధ్య నేరుగా రాకపోకలు

ఈ కొత్త రైలు అనకాపల్లిని హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ తో నేరుగా కలుపుతుంది. ఇప్పటి వరకు ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రత్యక్ష రైలు లేకపోవడంతో ప్రయాణికులు మార్గమధ్యంలో మారాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ కొత్త ఎక్స్‌ ప్రెస్ రైలు ద్వారా ప్రయాణం మరింత సులభంగా మారింది.

రెండు నెంబర్లు కేటాయించిన రైల్వే

Advertisement

ఈ సర్వీసుకు రెండు రైలు నంబర్లు కేటాయించారు. అనకాపల్లి నుంచి చర్లపల్లికి వెళ్లే రైలు నంబర్ 17046 కాగా, చర్లపల్లి నుంచి అనకాపల్లికి తిరిగి వచ్చే రైలు నంబర్ 17045గా ఉంటుంది. ఈ రైలు ప్రస్తుతం వారానికి ఒకసారి మాత్రమే నడుస్తుంది. ప్రయాణికులు మంచి స్పందన వస్తే భవిష్యత్తులో దీనిని తరచుగా నడిపే అవకాశం ఉంది. రైలు(నంబర్ 17046) ఆదివారం సాయంత్రం 5:35 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7:20 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా ఈ టైమ్ ఫిక్స్ చేశారు. రాత్రిపూట నిద్రించడానికి ఉదయం గమ్యస్థానానికి చేరుకునే సౌకర్యం లభిస్తుంది.

ఏ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందంటే?

ఈ రైలు మార్గం కూడా ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. అనకాపల్లి నుంచి బయల్దేరిన తర్వాత తుని, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట జంక్షన్ లాంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. ఈ మార్గంతో ఏపీ, తెలంగాణ మధ్య మంచి కనెక్టివిటీ పెరుగుతుంది.

అధునాతన సౌకర్యాలతో..

Advertisement

ఈ రైల్లో ఆధునిక సౌకర్యాలను కల్పించారు. ముఖ్యంగా ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని LHB కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ కోచ్‌ లు సాధారణ కోచ్‌ లతో పోల్చితే మరింత సురక్షితంగా ఉండటంతో పాటు, ప్రయాణంలో వైబ్రేషన్స్  తక్కువగా ఉండేలా రూపొందించబడ్డాయి. అలాగే సీటింగ్, నిద్ర సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉంటాయి.

ఉత్తర కోస్తా ప్రజలకు అనుకూలం

ఈ రైలు ప్రారంభం ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ వైపు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఇకపై మధ్యలో మార్పులు లేకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం లభిస్తుంది.  అనకాపల్లి – చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ ప్రెస్ రైలు ప్రారంభం ప్రాంతీయ రవాణాలో  కీలక ముందడుగుగా చెప్పుకోవచ్చు.

Read Also: బౌద్ధ ఆలయాల దర్శనం, ఏకంగా 20 శాతం డిస్కౌంట్ ప్రకటించిన IRCTC!

Related News

రైల్లో తలతిక్క వేషాలు.. వీణ్ణి బొక్కలో వేసి మక్కెలు విరగ్గొట్టండి సర్!

ఒమాన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? 14 రోజుల టూరిస్ట్ వీసా ఉచితం.. కానీ ఈ కండీషన్స్

ఈ పోస్ట్ ఆఫీస్ భూమిపై లేదు.. అందమైన సరస్సుపై తేలియాడే మంచి టూరిస్ట్ స్పాట్‌

శాపమా? కుట్రలా? కోహినూర్ వజ్రం తాకిన రాజవంశాలన్నీ ఎందుకు నాశనమయ్యాయి?

బుల్లెట్ రైల్లో భోజనం ఇలా ఉంటుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!

ఎయిర్ ఇండియా విమానంలో కుదుపులు.. పైకప్పులో పగుళ్లు, పలువురికి గాయాలు, అసలేం జరిగింది?

హోటల్లో ప్రేమికులు ఉండొచ్చా? పోలీసులకు అడ్డుకునే హక్కు లేదా? చట్టం ఏం చెబుతోంది!

ఆ రాష్ట్రానికి నో హై స్పీడ్ రైల్.. కేంద్రం షాకింగ్ డెసిషన్!

Big Stories

Advertisement
×