E-Paper

అనకాపల్లి–చర్లపల్లి కొత్త ఎక్స్‌ ప్రెస్ రైలు ప్రారంభం, ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

అనకాపల్లి–చర్లపల్లి కొత్త ఎక్స్‌ ప్రెస్ రైలు ప్రారంభం, ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
Advertisement

Anakapalli- Cherlapally Train: ఏపీకి రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ లోని అనకాపల్లి నుంచి కొత్త రైలు సర్వీసు ప్రారంభం అయ్యింది. ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ ను రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, అనకాపల్లి ఎంపీ సి ఎం. రమేష్ జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్‌ లో ఈ ప్రారంభోత్సవం కొనసాగుతోంది. చాలా కాలంగా ఉన్న ఈ డిమాండ్ నిజం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అనకాపల్లి- చర్లపల్లి మధ్య నేరుగా రాకపోకలు

ఈ కొత్త రైలు అనకాపల్లిని హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ తో నేరుగా కలుపుతుంది. ఇప్పటి వరకు ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రత్యక్ష రైలు లేకపోవడంతో ప్రయాణికులు మార్గమధ్యంలో మారాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ కొత్త ఎక్స్‌ ప్రెస్ రైలు ద్వారా ప్రయాణం మరింత సులభంగా మారింది.

రెండు నెంబర్లు కేటాయించిన రైల్వే

Advertisement

ఈ సర్వీసుకు రెండు రైలు నంబర్లు కేటాయించారు. అనకాపల్లి నుంచి చర్లపల్లికి వెళ్లే రైలు నంబర్ 17046 కాగా, చర్లపల్లి నుంచి అనకాపల్లికి తిరిగి వచ్చే రైలు నంబర్ 17045గా ఉంటుంది. ఈ రైలు ప్రస్తుతం వారానికి ఒకసారి మాత్రమే నడుస్తుంది. ప్రయాణికులు మంచి స్పందన వస్తే భవిష్యత్తులో దీనిని తరచుగా నడిపే అవకాశం ఉంది. రైలు(నంబర్ 17046) ఆదివారం సాయంత్రం 5:35 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7:20 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా ఈ టైమ్ ఫిక్స్ చేశారు. రాత్రిపూట నిద్రించడానికి ఉదయం గమ్యస్థానానికి చేరుకునే సౌకర్యం లభిస్తుంది.

ఏ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందంటే?

ఈ రైలు మార్గం కూడా ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. అనకాపల్లి నుంచి బయల్దేరిన తర్వాత తుని, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట జంక్షన్ లాంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. ఈ మార్గంతో ఏపీ, తెలంగాణ మధ్య మంచి కనెక్టివిటీ పెరుగుతుంది.

అధునాతన సౌకర్యాలతో..

Advertisement

ఈ రైల్లో ఆధునిక సౌకర్యాలను కల్పించారు. ముఖ్యంగా ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని LHB కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ కోచ్‌ లు సాధారణ కోచ్‌ లతో పోల్చితే మరింత సురక్షితంగా ఉండటంతో పాటు, ప్రయాణంలో వైబ్రేషన్స్  తక్కువగా ఉండేలా రూపొందించబడ్డాయి. అలాగే సీటింగ్, నిద్ర సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉంటాయి.

ఉత్తర కోస్తా ప్రజలకు అనుకూలం

ఈ రైలు ప్రారంభం ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ వైపు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఇకపై మధ్యలో మార్పులు లేకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం లభిస్తుంది.  అనకాపల్లి – చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ ప్రెస్ రైలు ప్రారంభం ప్రాంతీయ రవాణాలో  కీలక ముందడుగుగా చెప్పుకోవచ్చు.

Read Also: బౌద్ధ ఆలయాల దర్శనం, ఏకంగా 20 శాతం డిస్కౌంట్ ప్రకటించిన IRCTC!

Related News

భారత్ గౌరవ్ రైల్లో నేపాల్ టూర్.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ!

గోల్డెన్ చారియట్‌ కు సరికొత్త కొత్త హంగులు.. 2026-27 సీజన్ రెడీ!

ఒకప్పుడు ఫుల్ డిమాండ్.. ఇప్పుడు ఖాళీ బోగీలు.. లగ్జరీ రైలు ట్రిప్స్ క్యాన్సిల్!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..అందుబాటులోకి 1,000 కొత్త జనరల్ కోచ్‌లు!

రన్నింగ్ ట్రైన్లో దోపిడీ యత్నం.. రైల్వే పోలీసుల కాల్పులు..

చెన్నై-తిరుపతి మార్గంలో 8 రైళ్లు రద్దు.. ఎన్ని రోజులు అంటే?

బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొత్త టెక్నాలజీ.. తొలిసారిగా టన్నెల్ హుడ్స్ ఏర్పాటు!

రైలు ప్రమాదాల్లో బలవుతున్న గజరాజులు.. ఏడాదిలో ఎన్ని ప్రాణాలు కోల్పోయాయంటే?

×