Special Trains: ఆదివారం టీ-20 ప్రపంచ కప్ – 2026 ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గల నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య తుదిపోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముంబయి – అహ్మదాబాద్ మధ్య ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ రైల్వే జోన్ (Western Railway zone) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ను చూసేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల సౌకర్యం కోసం ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రకటించింది.
ఈ స్పెషల్ రైలు మార్చి 7 రాత్రి 11.45 గం.లకు ముంబయి సెంట్రల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది.
ఈ రైలు మార్చి 9న తెల్లవారుజామున 3 గంటలకు అహ్మదాబాద్ నుండి బయలుదేరి అదే రోజు ఉదయం 11.15 గంటలకు ముంబయి సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైళ్లు మార్గం మధ్యలో బోరివలి, వాపి, సూరత్, భరూచ్, వడోదర స్టేషన్లలో ఆగుతాయని పశ్చిమ రైల్వే స్పష్టం చేసింది.
తిరుగు ప్రయాణంలో ఫ్యాన్స్ రద్దీని దృష్టిలో ఉంచుకొని అహ్మదాబాద్ – ముంబయి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ (22961/22962) రైలుకు మార్చి 9వ తేది నుంచి 4 అదనపు కోచ్ లు జోడించాలని కూడా పశ్చిమ రైల్వే నిర్ణయించింది. అంటే ఇప్పటివరకు 16 కోచ్ లతో నడిచే అహ్మదాబాద్ – ముంబయి వందే భారత్ రైలు.. 9వ తేదీ నుంచి 20 కోచ్ లతో నడవనుంది. మార్చి 31వరకూ ఈ అదనపు కోచ్ లు కొనసాగుతాయని వెస్ట్రన్ రైల్వే వర్గాలు తెలిపాయి.
Also Read: Bullet Train Ticket: బుల్లెట్ రైలు టికెట్ ధరలపై.. పిచ్చక్లారిటీ వచ్చేసింది.. సామాన్యులకు పండుగే!
మ్యాచ్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ రైళ్లు, అదనపు భోగీలలో (వందే భారత్) టికెట్ బుక్ చేసుకునేందుకు ముందుగా IRCTC యాప్ లేదా వెబ్ సైట్ కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పైన ఇచ్చిన రైలు నెంబర్ సెర్చ్ చేసి.. టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలోని రైల్వేస్టేషన్ కు వెళ్లి టికెట్ కౌంటర్ల వద్ద బుకింగ్ పొందవచ్చు.