E-Paper
Advertisement

Special Trains: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. ఫ్యాన్స్‌కు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. మ్యాచ్ కోసం స్పెషల్ రైళ్లు!

Special Trains: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. ఫ్యాన్స్‌కు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. మ్యాచ్ కోసం స్పెషల్ రైళ్లు!

Special Trains: ఆదివారం టీ-20 ప్రపంచ కప్ – 2026 ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గల నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య తుదిపోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముంబయి – అహ్మదాబాద్ మధ్య ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ రైల్వే జోన్ (Western Railway zone) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల సౌకర్యం కోసం ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రకటించింది.

ముంబయి సెంట్రల్ – అహ్మదాబాద్ (09027)

ఈ స్పెషల్ రైలు మార్చి 7 రాత్రి 11.45 గం.లకు ముంబయి సెంట్రల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది.

అహ్మదాబాద్ – ముంబయి సెంట్రల్ (09028)

ఈ రైలు మార్చి 9న తెల్లవారుజామున 3 గంటలకు అహ్మదాబాద్ నుండి బయలుదేరి అదే రోజు ఉదయం 11.15 గంటలకు ముంబయి సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైళ్లు మార్గం మధ్యలో బోరివలి, వాపి, సూరత్, భరూచ్, వడోదర స్టేషన్లలో ఆగుతాయని పశ్చిమ రైల్వే స్పష్టం చేసింది.

వందే భారత్‌కు అదనపు కోచ్‌లు!

తిరుగు ప్రయాణంలో ఫ్యాన్స్ రద్దీని దృష్టిలో ఉంచుకొని అహ్మదాబాద్ – ముంబయి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ (22961/22962) రైలుకు మార్చి 9వ తేది నుంచి 4 అదనపు కోచ్ లు జోడించాలని కూడా పశ్చిమ రైల్వే నిర్ణయించింది. అంటే ఇప్పటివరకు 16 కోచ్ లతో నడిచే అహ్మదాబాద్ – ముంబయి వందే భారత్ రైలు.. 9వ తేదీ నుంచి 20 కోచ్ లతో నడవనుంది. మార్చి 31వరకూ ఈ అదనపు కోచ్ లు కొనసాగుతాయని వెస్ట్రన్ రైల్వే వర్గాలు తెలిపాయి.

Also Read: Bullet Train Ticket: బుల్లెట్ రైలు టికెట్ ధరలపై.. పిచ్చక్లారిటీ వచ్చేసింది.. సామాన్యులకు పండుగే!

టికెట్ బుకింగ్ ఎలా చేయాలి?

మ్యాచ్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ రైళ్లు, అదనపు భోగీలలో (వందే భారత్) టికెట్ బుక్ చేసుకునేందుకు ముందుగా IRCTC యాప్ లేదా వెబ్ సైట్ కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పైన ఇచ్చిన రైలు నెంబర్ సెర్చ్ చేసి.. టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలోని రైల్వేస్టేషన్ కు వెళ్లి టికెట్ కౌంటర్ల వద్ద బుకింగ్ పొందవచ్చు.

Also Read: IRCTC Shimla Tourist Train: సిమ్లా, కులు, మనాలికి సమ్మర్ ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రైన్.. టికెట్ పై 33 శాతం ఆఫర్

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×