E-Paper
Advertisement

Snake Shaped Temple: పాము ఆకారంలో గుడి..! పడగలపై తాండవం చేస్తున్న కృష్ణయ్య..

Snake Shaped Temple: పాము ఆకారంలో గుడి..! పడగలపై తాండవం చేస్తున్న కృష్ణయ్య..
Advertisement

Snake Shaped Temple: భాగవత పురాణంలోని కాళీయమర్ధన ఘట్టంలో విషం చిమ్మే పాము నుంచి ప్రజలను రక్షిస్తాడు. ఎమునా నదిలోకి కాళీంద్రుడు అనే పాము వెళ్లి విషాన్ని చిమ్మడంతో అందులో ఉన్న జలచరాలన్నీ ప్రాణాలు విడిచాయి. అదే సమయంలో స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లిన శ్రీకృష్ణుడు నదిలోకి చూసాడు. విషం వల్లే ఇలా జరిగిందని గుర్తిస్తాడు.

ఆ పాము విషం నుంచి ఎమునా నదిని శుద్ధి చేయాలని లోపలికి దూకేస్తాడు. ఆ తర్వాత పాముతో పోరాడి దాని పడగలపై చిన్ని కృష్ణయ్య తాండవం చేస్తాడు. కాళీయుడి భార్యలు కృష్ణుడి వైపు దీనంగా చూడడంతో మిమ్మల్ని చంపను అని కృష్ణుడు చెప్తాడు. నదిలో నుంచి విషాన్ని తొలగించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశిస్తాడు. దీంతో కాళీంద్రుడు, అతని భార్యలు నది నుంచి వెళ్లిపోతారు. దీంతో కాళీయమర్ధన ఘట్టం ముగుస్తుంది. ఇది భాగవతంలో అత్యంత ఆదరణ పొందిన ఘట్టం.

Advertisement

చిన్ని కృష్ణయ్య పాముపై తాండవం చేస్తున్న చిత్రాలు, విగ్రహాలు, ఫోటోలను చాలా చోట్ల చూసే ఉంటారు. కానీ, ఆ పాము ఆకారంలో ఉన్న ఆలయాన్ని ఎప్పుడైనా చూశారా..? తెలంగాణలో అతిపెద్ద పాము ఆకారంలో ఉన్న ఆలయం ఇదేనట. ఈ పాము పడగలపై శ్రీ కృష్ణుడు తాండవం చేస్తున్నట్లుగా కనిపించేలా ఆలయాన్ని నిర్మించారు. హైదరాబాద్ నుంచి 160 కి.మీ దూరంలో ఈ పాము ఆకారంలో ఉన్న గుడి ఉంది. కరీంనగర్ జిల్లాలోని వేములవాడకు దగ్గరలో ఉన్న నాంపల్లి గుట్ట అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది.

ALSO READ: ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఫలకంతో చెక్కిన ఆలయం

Advertisement

ఆలయం లోపలికి వెళ్లాలంటే రూ.5 ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గుడి బయట ఉగ్రరూప నరసింహస్వామి దర్శనం ఇస్తాడు. పాము ఆకారంలో నుంచి లోపలికి వెళ్తుంటే గుహలోకి వెళ్లినట్టే అనిపిస్తుంది. ఆలయంలోకి వెళ్లే దారిలో భాగవత పురాణంలోని అనేక ఘట్టాలకు సంబంధించిన దృశ్యాల విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయంలో లోపల హిరణ్యకశిపుడి పొట్టను చీల్చుతున్న ఉగ్రరూపం దాల్చిన నరసింహ స్వామి విగ్రహం కనిపిస్తుంది.

దీన్న చోళులు నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ అలయానికి దాదాపు 600 ఏళ్ల నాటి చరిత్ర ఉందట. శ్రీ రాజ రాజ నరేంద్రుడు అనే రాజు ఆలయం పక్కన ఉన్న కోనేటికి మెట్లు నిర్మించాడట. ఈ పాము ఆకారంలో ఉన్న ఆలయానికి దగ్గరలోనే వేములవాడ రాజన్న ఆలయం కూడా ఉంటుంది. అక్కడికి వెళ్తే ఒకే సారి రెండు ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఆలయానికి భక్తులతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది.

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×