Good News for Rail Passengers: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్- అనకాపల్లి మధ్య వీక్లీ స్పెషల్ రైలును ఇప్పుడు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ సర్వీస్గా మార్చేందుకు రైల్వేశాఖ గ్రీన్ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీస్ ఇకపై ప్రతివారం నడవనుంది. ఈ రైలుకు 17043, 17044 నెంబర్లను అధికారులు కేటాయించారు.
రైలు నెం. 17043 సికింద్రాబాద్ – అనకాపల్లి వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసులు మే 24 నుంచి ప్రారంభమవుతాయి. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 17044 అనకాపల్లి – సికింద్రాబాద్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రతి సోమవారం సాయంత్రం 5:35 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరి, మంగళవారం ఉదయం 8:40 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. ఈ సర్వీస్ మే 18 నుంచి అందుబాటులోకి రానుంది.
ఈ రైలు మార్గ మధ్యంలో పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి, నల్లగొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సమల్కోట్, అన్నవరం, తుని, ఎలమంచిలి లాంటి స్టేషన్ల రెండు వైపులా ఆగుతుంది. ఈ స్టేషన్లలో ప్రయాణికులకు ఎక్కే, దిగే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణించే వారికి ఈ రైలు ఎంతో ఉపయోగపడనుంది. అలాగే, విశాఖపట్నం సమీప ప్రాంతాల నుంచి తెలంగాణకు వెళ్లే ప్రయాణికులకు కూడా సౌకర్యంగా ఉంటుంది.
🚆 New Weekly Express Train Announced between #Anakapalle and #Secunderabad.
🔹 Train No. 17044 (Anakapalle → Secunderabad)
🗓️ Every Monday from 18.05.2026
🔹 Train No. 17043 (Secunderabad → Anakapalle)
🗓️ Every Sunday from 24.05.2026#IndianRailways #NewTrain pic.twitter.com/RCRDUFavHH— Vijayawada Division (@drmvijayawada) May 7, 2026
Read Also: 40 ఏళ్ల నాటి రైల్వే రిజర్వేషన్ సిస్టమ్కు గుడ్బై.. AI ఆధారిత టికెట్ సేవలు వచ్చేస్తున్నాయ్!
ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణికుల సౌకర్యం కోసం పలు తరగతుల కోచ్లను ఏర్పాటు చేశారు. ఒక ఫస్ట్ ఏసీ (1A), నాలుగు సెకండ్ ఏసీ (2A), పన్నెండు థర్డ్ ఏసీ (3AC) కోచ్లు ఈ రైలులో ఉంటాయి. దీని వల్ల సుదూర ప్రయాణం చేసే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో స్పెషల్ సర్వీస్ను రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ గా మార్చినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ కొత్త సర్వీసుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రైలు కనెక్టివిటీ మరింత మెరుగవుతుందన్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ ఎం మంద్రుప్కర్ కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకుని ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
Read Also: భారత్ గౌరవ్ రైలులో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. మరీ ఇంత తక్కువ ధరలోనా?