E-Paper
Advertisement

సికింద్రాబాద్–అనకాపల్లి మధ్య వీక్లీ ఎక్స్‌ ప్రెస్, ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!

సికింద్రాబాద్–అనకాపల్లి మధ్య వీక్లీ ఎక్స్‌ ప్రెస్,  ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!
Advertisement

Good News for Rail Passengers: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్- అనకాపల్లి మధ్య వీక్లీ స్పెషల్ రైలును ఇప్పుడు రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ ప్రెస్ సర్వీస్‌గా మార్చేందుకు రైల్వేశాఖ గ్రీన్ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీస్ ఇకపై ప్రతివారం నడవనుంది.  ఈ రైలుకు 17043, 17044 నెంబర్లను అధికారులు కేటాయించారు.

కొత్త రైల్వే సర్వీస్ షెడ్యూల్ వివరాలు

రైలు నెం. 17043 సికింద్రాబాద్ – అనకాపల్లి వీక్లీ ఎక్స్‌ ప్రెస్ ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసులు మే 24  నుంచి ప్రారంభమవుతాయి. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 17044 అనకాపల్లి – సికింద్రాబాద్ వీక్లీ ఎక్స్‌ ప్రెస్ ప్రతి సోమవారం సాయంత్రం 5:35 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరి, మంగళవారం ఉదయం 8:40 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ సర్వీస్ మే 18 నుంచి అందుబాటులోకి రానుంది.

ఏ రైల్వే స్టేషన్లలో ఆగుతుందంటే?

Advertisement

ఈ రైలు మార్గ మధ్యంలో పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి, నల్లగొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సమల్కోట్, అన్నవరం, తుని, ఎలమంచిలి లాంటి స్టేషన్ల రెండు వైపులా ఆగుతుంది. ఈ స్టేషన్లలో ప్రయాణికులకు ఎక్కే, దిగే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణించే వారికి ఈ రైలు ఎంతో ఉపయోగపడనుంది. అలాగే, విశాఖపట్నం సమీప ప్రాంతాల నుంచి తెలంగాణకు వెళ్లే ప్రయాణికులకు కూడా సౌకర్యంగా ఉంటుంది.

Advertisement

Read Also: 40 ఏళ్ల నాటి రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌కు గుడ్‌బై.. AI ఆధారిత టికెట్ సేవలు వచ్చేస్తున్నాయ్!

ఈ రైళ్లలో ఏ కోచ్ లు ఉంటాయంటే?

ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణికుల సౌకర్యం కోసం పలు తరగతుల కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఒక ఫస్ట్ ఏసీ (1A), నాలుగు సెకండ్ ఏసీ (2A), పన్నెండు థర్డ్ ఏసీ (3AC) కోచ్‌లు ఈ రైలులో ఉంటాయి. దీని వల్ల సుదూర ప్రయాణం చేసే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో స్పెషల్ సర్వీస్‌ను రెగ్యులర్ ఎక్స్‌ ప్రెస్‌ గా మార్చినట్లు రైల్వే అధికారులు  చెప్పారు. ఈ కొత్త సర్వీసుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రైలు కనెక్టివిటీ మరింత మెరుగవుతుందన్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ ఎం మంద్రుప్కర్ కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకుని ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Read Also: భారత్ గౌరవ్ రైలులో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

Related News

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

Big Stories

Advertisement
×