E-Paper
Advertisement

అమృత్ భారత్ స్కీమ్‌ లోకి పిఠాపురం.. ఇక విమానాశ్రయాన్ని తలదన్నేలా రైల్వే స్టేషన్!

అమృత్ భారత్ స్కీమ్‌ లోకి పిఠాపురం.. ఇక విమానాశ్రయాన్ని తలదన్నేలా రైల్వే స్టేషన్!
Advertisement

Pithapuram Station Modernization: పిఠాపురం ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చాలా కాలంగా పునర్నిర్మాణ పనుల కోసం ఎదురుచూస్తున్న పిఠాపురం రైల్వే స్టేషన్‌ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో పిఠాపురం రైల్వే స్టేషన్‌ను చేర్చినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం స్థానిక ప్రజలకు మాత్రమే కాకుండా, ఆ ప్రాంతం అభివృద్ధికి కూడా చాలా ఉపయోగపడనుంది.

డిప్యూటీ సీఎం ప్రతిపాదనకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రాజెక్ట్‌ కు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రతిపాదనలకు తాజాగా రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా కాలంగా స్టేషన్‌లో అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం దొరకనుంది.

విమానాశ్రయంలా మారనున్న రైల్వే స్టేషన్

Advertisement

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా పిఠాపురం స్టేషన్‌ ను పూర్తిగా అత్యాధునికంగా మార్చే పనులు చేపడతారు. ముఖ్యంగా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే విధంగా వెయిటింగ్ రూమ్‌లు నిర్మించనున్నారు. ప్రస్తుతం స్టేషన్‌లో తగినంత కూర్చునే స్థలం లేకపోవడం వల్ల వృద్ధులు, మహిళలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా నిర్మించే వెయిటింగ్ హాల్స్ ఈ సమస్యను చాలా వరకు తగ్గిస్తాయి.

ఇక స్టేషన్‌ లో లిఫ్ట్‌ లు, ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు ప్లాట్‌ ఫారమ్‌ ల మధ్య మారేందుకు మెట్లు మాత్రమే ఉండటంతో, వృద్ధులు, బరువైన సామాను తీసుకెళ్లే ప్రయాణికులకు చాలా కష్టం అవుతోంది. లిఫ్ట్‌ లు, ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సులభం అవుతుంది. అంతేకాకుండా, స్టేషన్‌ను శుభ్రంగా, ఆకర్షణీయంగా మార్చే పనులు కూడా చేపడతారు. ప్లాట్‌ ఫారమ్‌ లు విస్తరించడం, మంచి లైటింగ్ ఏర్పాటు, సిగ్నేజ్‌ లు మెరుగుపరచడం లాంటి పనులు కూడా ఈ ప్రాజెక్ట్‌ లో భాగం కానున్నాయి. దీని వల్ల ప్రయాణికులకు స్టేషన్ లో ఆహ్లాదకర వాతావరణం లభిస్తుంది.

పెరగనున్న ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి

Advertisement

అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత, పిఠాపురం స్టేషన్ ప్రాంతానికి కొత్త గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందితే, చుట్టుపక్కల వ్యాపారాలు కూడా పెరుగుతాయి. చిన్న వ్యాపారులు, దుకాణదారులు, ఆటో డ్రైవర్లకు మంచి ఉపాధి కలగనుంది. ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అభివృద్ధి పనులు ఇప్పుడు మొదలవుతుండటంతో, పిఠాపురంలో త్వరలోనే ఆధునిక రైల్వే స్టేషన్ కనువిందు చేసే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి, ఈ ప్రాజెక్ట్ పిఠాపురం ప్రాంతానికి ఒక పెద్ద ముందడుగుగా చెప్పవచ్చు.

Read Also: బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌ వే కింద 600 మీటర్ల టన్నెల్, హైదరాబాద్‌లో అరుదైన ప్రాజెక్ట్!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×