E-Paper
Advertisement

Bullet Train: సూరత్‌ బుల్లెట్ రైలు స్టేషన్‌ కు ప్రధాని మోడీ, పనుల పురోగతిపై సమీక్ష!

Bullet Train:  సూరత్‌ బుల్లెట్ రైలు స్టేషన్‌ కు ప్రధాని మోడీ, పనుల పురోగతిపై సమీక్ష!

భారత్ లో ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తుండగా, త్వరలో బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.  ముంబై- అహ్మదాబాద్ నగరాల నడుమ ఈ హైస్పీడ్  రైళ్లు తమ సేవలను కొనసాగించనున్నాయి. ఈ రైలు ప్రారంభం తర్వాత రెండు నగరాల మధ్య ప్రయాణం కేవలం 2 గంటల 7 నిమిషాలకు పరిమితం కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సూరత్ లో జరుగుతున్న బుల్లెట్ రైలు పనులను పరిశీలించారు. ఇవాళ ఉదయం సూరత్ కు వెళ్లిన ఆయన, నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు స్టేషన్ అంట్రోలి ప్రాంతానికి చేరుకున్నారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం అధికారులను అడిగి పనుల పురోగతిపై సమీక్షించారు. వేగంగా పనులు పూర్తి చేయాలని ప్రధాని  ఆదేశించారు.

బుల్లెట్ రైలు ప్రాజెక్టు గురించి..   

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మొత్తం 508 కి.మీ పరిధిలో విస్తరించి ఉంటుంది. ఇది గుజరాత్ లో 352 కి.మీ.. మహారాష్ట్రలో 156 కి.మీ కవర్ చేస్తుంది. ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)ను గుజరాత్‌ లోని వాపి, సూరత్, వడోదర, అహ్మదాబాద్, సబర్మతిని కలుపుతూ హైస్పీడ్ రైలు నడుస్తుంది. ఈ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఈ కారిడార్‌ లో మహారాష్ట్ర, గుజరాత్ లో కలిపి మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి.

రూ.1.8 లక్షల కోట్లతో బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం

ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు (MAHSR) ప్రాజెక్ట్ ను సుమారు రూ.1,08,000 కోట్లతో నిర్మిస్తున్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) ప్రాజెక్ట్ వ్యయంలో 81% అంటే రూ. 88,000 కోట్ల నిధులు సమకూరుస్తోంది. జపాన్ బుల్లెట్ రైలు సాంకేతికతను ఉపయోగించి భారత్ లో తొలి హైస్పీడ్ రైలు ప్రయత్నానికి సపోర్టు చేస్తుంది. 2023లో, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ఈ ప్రాజెక్ట్ కోసం రెండు హైస్పీడ్ రైళ్లను రూపొందించడానికి, తయారు చేయడానికి, కమిషన్ చేయడానికి BEML లిమిటెడ్‌కు ఒక ఒప్పందాన్ని ఇచ్చింది. ప్రతి హై-స్పీడ్ కారు ధర రూ.27.86 కోట్లు. మొత్తం కాంట్రాక్ట్ విలువ రూ.866.87 కోట్లు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జపనీస్ షింకన్‌సెన్ సాంకేతికతను ఉపయోగించి రెండు ట్రైన్‌ సెట్‌ లను అభివృద్ధి చేయనుంది.

Read Also:  దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్.. దీని ముందు ఎయిర్ పోర్ట్ దిగదుడుపే!

2027 నాటికి అందుబాటులోకి!

అటు ఈ బుల్లెట్ రైలును 2027 చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గత పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో, గుజరాత్‌ లోని వాపి నుంచి సబర్మతి విభాగం డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్ డిసెంబర్, 2029 నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అనేది సంక్లిష్టమైన, సాంకేతికతతో కూడిన వ్యవహారంగా ఆయన అభివర్ణించారు.

Read Also:  ప్రపంచంలోనే అద్భుతమైన రైళ్లు, పట్టాలెక్కాయంటే రైల్వే రూపురేఖలు మారాల్సిందే!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×