E-Paper
Advertisement

Vande Bharat Train Coaches: వందే భారత్ రైళ్లలో విపరీతమైన రద్దీ.. ఈ రూట్లలో పెరగనున్న కోచ్‌ల సంఖ్య!

Vande Bharat Train Coaches: వందే భారత్ రైళ్లలో విపరీతమైన రద్దీ.. ఈ రూట్లలో పెరగనున్న కోచ్‌ల సంఖ్య!
Advertisement

Vande Bharat Express News: భారతీయ రైల్వే వ్యవస్థలో వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టాయి. ప్రపంచ స్థాయి వసతులు కల్పించడంతో పాటు అత్యంత వేగంగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వందేభారత్ రైల్లో ప్రయాణం చేందుకు మొగ్గు చూపుతున్నారు. సాధారణ రైళ్లతో పోల్చితే వీటి టికెట్ ధర ఎక్కువ అయినప్పటికీ, ఇందులోనే వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చాలా చోట్ల వందేభారత్ రైళ్లలో ప్రయాణీకులు సామర్థ్యానికి మించి ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో అదనపు కోచ్ లు యాడ్ చేయాలని భావిస్తున్నారు.

రద్దీ రూట్లలో పెరగనున్న కోచ్ లు

Advertisement

అత్యంత రద్దీ ఉన్న మార్గాల్లో మధురై రైల్వే డివిజన్‌ లోని తిరునెల్వేలి- చెన్నై ఎగ్మోర్ రూట్ ఒకటి. ఈ మార్గంలో ప్రస్తుతం ఎనిమిది కోచ్‌ లతో వందే భారత్ రైలు నడుస్తోంది. ఈ రూట్ లోని ప్రీమియం రైలుకు ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రైలును 8 కోచ్‌ల నుంచి 16 కోచ్‌ లకు మార్చాలని భావిస్తున్నారు. తిరునెల్వేలి-చెన్నై ఎగ్మోర్- తిరునెల్వేలి వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ ను గత ఏడాది సెప్టెంబర్ లో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇది దక్షిణ తమిళనాడుకు మొదటి వందే భారత్ రైలు.

ప్రయాణీకుల నుంచి భారీ డిమాండ్

Advertisement

తిరునెల్వేలి- చెన్నై ఎగ్మోర్‌ లను కలిపే ఈ వందే భారత్ రైలు టైమింగ్స్ ప్రయాణీకులకు  చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. రైలు తిరునెల్వేలి నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుంది. ఈ రైలు మదురై, తిరుచ్చి ప్రయాణీకులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ స్టేషన్లకు ఉదయం 7:50, 9:50 గంటలకు చేరుకుంటుంది. అటు ఈ రైలు చెన్నై ఎగ్మోర్ నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి రాత్రి 10:40 గంటలకు తిరునెల్వేలి చేరుకుంటుంది. సాయంత్రం 6:40 గంటలకు తిరుచ్చి, 8.30 గంటలకు మధురై చేరుకుంటుంది. సో, చెన్నై నుంచి వెళ్లే ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే, ఈ రూట్ లో ఎక్కువ రద్దీ ఉంటుంది.

Read Also: వార్ని.. 4 గంటల్లోనే బెంగళూరుకు? ఈ వందేభారత్ ట్రైన్ చాలా స్పీడు గురూ!

కోచ్ ల పెంపు కోరుతూ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు  

అత్యంత డిమాండ్ ఉన్న ఈ రూట్ లో కోచ్ ల సంఖ్య పెంచాలని కోరుతూ మధురై రైల్వే డివిజన్ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌ లకు బదులుగా 16 కోచ్‌ లను జోడించాలని కోరింది.  “ఈ రైలును 16 కోచ్‌ లుగా మార్చే ప్రతిపాదనను రైల్వే బోర్డు ఆమోదిస్తుందని భావిస్తున్నాం. ఇదే జరిగితే ఈ రైలులో ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది” అని మధురై డివిజనల్ రైల్వే మేనేజర్ శరద్ శ్రీవాస్తవ తెలిపారు.

Read Also: వచ్చేస్తోంది.. బుల్లెట్ ట్రైన్, నెక్ట్స్ ఈ రూట్లలోనే పరుగు.. మన తెలుగు రాష్ట్రాలు?

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×