E-Paper
Advertisement

New High Speed Bullet Trains: వచ్చేస్తోంది.. బుల్లెట్ ట్రైన్, నెక్ట్స్ ఈ రూట్లలోనే పరుగు.. మన తెలుగు రాష్ట్రాలు?

New High Speed Bullet Trains: వచ్చేస్తోంది.. బుల్లెట్ ట్రైన్, నెక్ట్స్ ఈ రూట్లలోనే పరుగు.. మన తెలుగు రాష్ట్రాలు?
Advertisement

New High Speed Bullet Trains Corridors: భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైల్వే సంస్థపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దశాబ్దాలు కొనసాగుతున్న మూస ధోరణికి ఆధునిక హంగులు తీసుకొచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే మేకిన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశ రైల్వే ముఖ చిత్రాన్ని ఈ రైళ్లు పూర్తిగా మార్చివేశాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రయాణీకులకు మెరుగైన వసతులు కల్పిస్తూ శరవేగంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. వందేభారత్ రైళ్లు రోజు రోజుకు అప్ డేట్ అవుతూ ప్రయాణీకులకు మెరుగైన సర్వీసులను అందిస్తున్నాయి.

శరవేగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు

Advertisement

ఓవైపు సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి రాగా, మరోవైపు బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం అహ్మాదాబాద్- ముంబై మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అహ్మదాబాద్-ముంబై మధ్య 508 కిలో మీటర్ల మేర తొలి హైస్పీడ్ కారిడార్ నిర్మాణం అవుతోంది. ఈ రూట్ లో గంటకు 320 కి.మీ వేగంతో బుల్లెట్ రైళ్లు ప్రయాణించనున్నాయి. కేవలం రెండు గంటల వ్యవధిలో బుల్లెట్ రైళ్లు రెండు నగరాలను కలపనున్నాయి. సూరత్, వడోదరతో పాటు 12 పరిమిత స్టాపులలో బుల్లెట్ ట్రైన్‌ హాల్టింగ్ కు అవకాశం ఉంటుంది.

జపాన్ టెక్నాలజీ సాయంతో..

Advertisement

ముంబై-అహ్మదాబాద్ నడుమ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం జపాన్ సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తున్నది. 508 కిలో మీటర్లలో ఇప్పటి వరకు 336 కిలో మీటర్ల పీర్ ఫౌండేషన్, 225 కిలో మీటర్ల గిర్డర్ లాంచింగ్ పూర్తయ్యింది. ఈ ప్రాజెక్టులో కీలకమైన 21 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మాణం సైతం ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ మార్గంలో మొత్తం 24 బ్రిడ్జిలు, ఏడు కొండలకు సొరంగాలను పూర్తి చేయనున్నారు. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ నిర్మాణాల కోసం నిరంతరంగా పని చేస్తున్నది. 2026లో ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ల కొత్త కారిడార్లకు ప్రణాళికలు

ఓ వైపు ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుండగా, మరోవైపు దేశ వ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో హై స్పీడ్ ట్రైన్ కారిడార్ల కోసం ప్రణాళికలను రెడీ అవుతున్నాయి. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ భవిష్యత్ కారిడార్ల కోసం డీపీఆర్ లు రెడీ సిద్ధం చేస్తున్నది.

హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కొత్త కారిడార్లు ఇవే!

అటు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కొత్త కారిడార్లపై నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-అహ్మదాబాద్, ఢిల్లీ-అమృతసర్, ముంబై-నాగ్‌పూర్ నడుమ కొత్తకారిడార్లను నిర్మించాలని భావిస్తున్నది. ఇందులో భాగంగానే అధికారులు డీపీఆర్ లను రూపొందిస్తున్నారు.

Read Also: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి, దీని ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×