SCR Trains Cancelled: వేసవిలో సాధారణంగా రైలు ప్రయాణాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇస్తుండడంతో.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణాలనే ఎంచుకుంటారు. అయితే దక్షిణ మధ్య రైల్వే పలు రైలు సర్వీసులను రద్దు చేసి తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు సమ్మర్ షాక్ ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రయాణించే 15 సర్వీసులను ఏప్రిల్ 19 వరకు రద్దు చేసింది. పలు రైల్వే మార్గాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా పనుల కారణంగా మొత్తం 15 రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
విద్యుదీకరణ, ట్రాక్ డబ్లింగ్, లేటెస్ట్ సిగ్నలింగ్ అప్గ్రేడ్ పనులు, ట్రాక్ నిర్వహణలో భాగంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సురక్షితమైన రైలు రాకపోకల కోసం ప్రస్తుతం మహబూబ్నగర్, మన్యంకొండ స్టేషన్ల మధ్య నాన్-ఇంటర్లాకింగ్ పనులు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య నడిచే MEMU, DEMU సర్వీసులపై ఎక్కువగా ప్రభావం పడనుంది. దీంతో నిత్యం ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందిపనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, కాచిగూడ, గుంటూరు, సికింద్రాబాద్ మధ్య పలు లోకల్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.
వేసవి కాలంలో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో రైళ్ల రద్దీ అసౌకర్యం కలిగిస్తున్నప్పటికీ, ప్రయాణికుల సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. పలు రైళ్లను స్వల్పంగా టైమ్ మార్చి తిరిగి ప్రారంభించారు. రైళ్ల రద్దుతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
రైళ్ల రద్దుతో ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైల్వే వెబ్సైట్ లేదా NTES ప్లాట్ఫామ్ను లో ట్రైన్ రన్నింగ్ స్టేటస్ తనిఖీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read:ప్రకృతి అందాల నడుమ 180 డిగ్రీ వ్యూ.. విస్టాడోమ్ ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి బ్రో!