E-Paper
Advertisement

వందేభారత్ ఫుడ్ సేఫ్ కాదా? భయపెడుతున్న తాజా ల్యాబ్ రిపోర్ట్!

వందేభారత్ ఫుడ్ సేఫ్ కాదా?  భయపెడుతున్న తాజా ల్యాబ్ రిపోర్ట్!

IRCTC Food Controversy: ఇటీవల భారతీయ రైల్వే ఫుడ్ గురించి మరోసారి చర్చ మొదలైంది. ప్రయాణ సమయంలో అందించే భోజనం ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. దీనికి కారణం, తాజాగా ఓ ప్రైవేట్ టెస్టింగ్ సంస్థ విడుదల చేసిన నివేదిక. ఆ సంస్థ విడుదల చేసిన వీడియోలో, IRCTC ద్వారా అందించే భోజనం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది.

ఇంతకీ ల్యాబ్ రిపోర్టులో ఏం తేలిందంటే?

తాజాగా సదరు సంస్థ విడుదల చేసిన వీడియోలో.. ఈ పరీక్షలను బ్లైండ్ ల్యాబ్ టెస్టింగ్ పద్ధతిలో నిర్వహించారు. అంటే, నమూనాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకుండా పరీక్షించడం జరిగింది. ఈ విధానం వల్ల ఫలితాలు మరింత నిష్పక్షపాతంగా ఉంటాయని చెబుతారు. ఈ పరీక్షల్లో పప్పు, జీరా రైస్, పనీర్ లాంటి వంటకాల్ని పరిశీలించారు. ఈ పరీక్షలో వచ్చిన ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ వంటకాలలో బ్యాక్టీరియా స్థాయి పరిమితికి మించి ఉన్నట్లు వెల్లడించారు. సాధారణంగా ఆహారంలో ఉండే బ్యాక్టీరియా పరిమాణం నిర్దిష్ట స్థాయిలో ఉండాలి. అయితే, ఈ పరీక్షల్లో ఆ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. దీని వల్ల ఆహార పరిశుభ్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కొన్ని పరీక్షల్లో పాజిటివ్ రిజల్ట్స్

వందేభారత్ ఫుడ్ కు సంబంధించి అన్ని పరీక్షల్లో ప్రతికూల ఫలితాలే రాలేదు. ఆ సంస్థ విడుదల చేసిన వీడియోలో మరో విషయం కూడా స్పష్టమైంది. అఫ్లాటాక్సిన్లు, భార లోహాలు లాంటి ప్రమాదకర పదార్థాల కోసం చేసిన పరీక్షల్లో మాత్రం ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపారు. అంటే, కొన్ని ప్రమాదకర పదార్థాలు పరిమితికి లోబడి ఉన్నట్లు వెల్లడించారు.

రైల్వే ఫుడ్ పై ప్రయాణికులలో ఆందోళన

తాజా రిపోర్టు బయటకు రావడంతో రైలు ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసే వారు ఎక్కువగా ట్రైన్‌లో అందించే భోజనంపైనే ఆధారపడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆహారం సురక్షితం కాదనే భావన కలగడం సహజం. ప్రయాణ సమయంలో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారం పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. నిజానికి  గతంలో కూడా IRCTC ఆహారంపై ఫిర్యాదులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు సదరు క్యాటరింగ్ సంస్థలపై చర్యలు తీసుకున్న ఘటనలు ఉన్నాయి.

ఈ పరిణామాలన్నింటిని చూస్తే, రైల్వే ఆహార నాణ్యతపై మరింత కఠిన నియంత్రణ అవసరం అని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. పరీక్షలు క్రమం తప్పకుండా జరపాలంటున్నారు. అలాగే, క్యాటరింగ్ సంస్థలు కూడా నాణ్యతపై రాజీ పడకూడదంటున్నారు. భవిష్యత్తులో రైల్వే ఫుడ్ విషయంలో సమస్యలు రాకుండా ఉండాలంటే కచ్చితమైన ప్రమాణాలు పాటించడం, క్రమమైన తనిఖీలు చేయడం చాలా అవసరం. ప్రయాణికులు కూడా తమ ఆహారంపై ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయడం మంచిదంటున్నారు అధికారులు.

Read Also: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్.. కొత్తగా మరో 3 ఎంఎంటీఎస్ స్టేషన్లు!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×