E-Paper
Advertisement

Free Visa: శ్రీలంక బంపర్ ఆఫర్.. ఇండియన్ టూరిస్టులకు ఫ్రీ వీసా!

Free Visa: శ్రీలంక బంపర్ ఆఫర్.. ఇండియన్ టూరిస్టులకు ఫ్రీ వీసా!
Advertisement

Sri Lanka New Free Visa Policy: శ్రీలంకకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై భారతీయ పర్యాటకులు శ్రీలంకకు వెళ్తే 30 రోజుల పాటు ఉచిత ఆన్ అరైవల్ వీసా సౌకర్యాన్ని కల్పించనుంది. ఈ నిర్ణయాన్ని ఇటీవల శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.  ఈ నిర్ణయంతో విదేశీ టూర్ ప్లాన్ చేసే భారతీయులకు ప్రయాణ ఖర్చు కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.

30 రోజుల ఫ్రీ ఆన్ అరైవల్ వీసా

తాజా నిబంధనల ప్రకారం, భారతీయులు శ్రీలంకకు చేరుకున్న తర్వాత ఉచిత వీసా పొందే అవకాశం ఉంటుంది. ఈ వీసా 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇందులో డబుల్ ఎంట్రీ కూడా ఉంటుంది. అంటే ఒకసారి శ్రీలంకకు వెళ్లిన తర్వాత ఆ 30 రోజుల వ్యవధిలో మరోసారి అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు విదేశీ ప్రయాణాల్లో వీసా ఫీజులు టూరిస్టులకు ఎక్కువ భారంగా ఉండేవి. ముఖ్యంగా కుటుంబంతో వెళ్లే పర్యాటకులకు ఈ ఖర్చు మరింత పెరిగేది. ఇప్పుడు ఉచిత ఆన్ అరైవల్ వీసా అందుబాటులోకి రావడంతో భారతీయ పర్యాటకులలో శ్రీలంక టూర్లపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.

ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ తప్పనిసరి!   

Advertisement

అయితే, వీసా ఉచితం అయినప్పటికీ ప్రయాణికులు ముందుగానే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని శ్రీలంక ఇమ్మిగ్రేషన్ విభాగం వెల్లడించింది. అంటే ప్రయాణానికి ముందు ఆన్‌లైన్‌లో ETA కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ ప్రక్రియ మరింత సులభంగా సాగుతుంది.

భారత్ నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్టులు

భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో పర్యాటకులు శ్రీలంకను సందర్శిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంకకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. బీచ్‌లు, చారిత్రక ప్రదేశాలు, బౌద్ధ ఆలయాలు, ప్రకృతి అందాలు, తక్కువ ఖర్చుతో ట్రిప్ పూర్తి చేయగలగడం వల్ల శ్రీలంక భారతీయులకు ఎంతో ఇష్టమైన టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారింది.

మరో 40 దేశాలకు ఉచిత ఆన్ అరైవల్ వీసా

Advertisement

భారతదేశంతో పాటు మరో 40 దేశాలకు కూడా ఈ ఉచిత ఆన్ అరైవల్ వీసాను ప్రకటించింది శ్రీలంక. వీటిలో యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, చైనా, రష్యా వంటి దేశాలు ఉన్నాయి. అటు సింగపూర్, మాల్దీవులు, సీషెల్స్ లాంటి దేశాలతో ప్రత్యేక ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ కొత్త నిర్ణయంతో శ్రీలంక టూరిజం రంగానికి మరింత బూస్టింగ్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఈ నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుందని ట్రావెల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: 60 రోజుల ఫ్రీ ఎంట్రీ క్యాన్సిల్.. ఇక థాయ్‌లాండ్‌కు వెళ్లాలంటే వీసా ఉండాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

Big Stories

Advertisement
×