Delhi Airport: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి జ్యూరిచ్ వెళ్లాల్సిన స్విస్ ఎయిర్లైన్స్ విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా టేకాఫ్ రద్దు చేసుకుంది. ఫలితంగా విమానాన్ని అత్యవసరంగా ఖాళీ చేయిస్తుండగా ఆరుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అసలు ఏమి జరిగింది?
ఢిల్లీ ఎయిర్పోర్టులో స్విస్ విమానానికి తప్పిన ప్రమాదం
ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జూరిచ్కు వెళ్తున్న స్విస్ విమానం ఇంజన్లలో సమస్యలు తలెత్తాయి. ఫలితంగా టేకాఫ్ను రద్దు చేసుకుంది ఆ విమానం. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అర్ధరాత్రి 1.08 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. LX147 విమానం రన్వేపై టేకాఫ్ కోసం వెళ్తుండగా ఇంజిన్లో సమస్యను గుర్తించారు అందులోని సిబ్బంది. వెంటనే టేకాఫ్ను నిలిపి వేసి విమానాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించారు. ఆ సమయంలో విమానంలో దాదాపు 232 మంది ప్రయాణికులు ఉన్నారు.
టేకాఫ్ను రద్దు చేసిన విమానం.. , ఆరుగురు ప్రయాణికులకు గాయాలు
అందులో నలుగురు చిన్నారులతోపాటు సిబ్బంది ఉన్నారు. చివరకు ప్రయాణికులను ఎమర్జెన్సీ గేటు ద్వారా కిందకు దించారు. ఈ ప్రక్రియలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనపై స్విస్ ఎయిర్లైన్స్ ఓ ప్రకటన చేసింది. ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
విమానాన్ని పరిశీలించేందుకు ఢిల్లీకి సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపుతున్నామని పేర్కొంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హోటల్ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసింది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రత మాకు ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యత అని అందులో పేర్కొంది.
ALSO READ: ఏసీ కోచ్లో చెత్త టాయిలెట్లు, రైల్వేకు భారీ జరిమానా!
Emergency evacuation from Swiss Delhi – Zurich flight LX0147 pic.twitter.com/rvzhCPb3bg
— Ishan Jain (@JainIshan316) April 25, 2026