Tirupati Travel Alert: మే 2 వరకు తిరుపతికి వెళ్లాలనుకుంటున్నారా? శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే, మీకో అలర్ట్. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇంకొన్ని రైళ్లు ఆలస్యంగా నడవడంతో పాటు కొన్ని స్టేషన్లలో హాల్టింగ్ కూడా ఉండదన్నారు. రైల్వే పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంతకీ ఏ రైళ్లు రద్దు అయ్యాయి, వేటిని దారిమళ్లించారు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ తిరుపతి- భువనేశ్వర్
⦿ తిరుపతి- చెన్నై
⦿ తిరుపతి- విల్లుపురం
⦿ తిరుపతి-కాట్పాడి
⦿ తిరుపతి-కోయంబత్తూరు
⦿ తిరుపతి- రామేశ్వరం
వీటిని కొన్ని సెగ్మెంట్స్ లోనే రద్దు చేశారు.
⦿ తిరుపతి- కొల్లాం
⦿ కొల్లాం- తిరుపతి
⦿ మన్నార్ గుడి-తిరుపతి
⦿ తిరుపతి- మన్నార్ గుడి
⦿ తిరుపతి – కాచిగూడ ఎక్స్ ప్రెస్
⦿ తిరుపతి- మైసూర్ ఎక్స్ ప్రెస్
⦿ హజ్రత్ నిజాముద్దీన్- తివేండ్రం రాజధాని ఎక్స్ ప్రెస్
⦿ బెంగళూరు – హటియా
⦿ హజ్రత్ నిజముద్దీన్- ఎర్నాకుళం
⦿ తిరునల్వేలి- కత్రా
⦿ నాగర్ కోయిల్- షాలిమర్
Read Also: ఏపీకి గుడ్ న్యూస్, కాకినాడ నుంచి మైసూరు వరకు డైరెక్ట్ రైలు వచ్చేస్తోంది!
⦿ తిరుపతి
⦿ చంద్రగిరి
⦿ తిరుచానూరు
⦿ చిత్తూరు
శ్రీవారి దర్శననాకి వెళ్లే ప్రయాణికులకు అధికారులు కీలక సూచనలు చేశారు. IRCTC / NTESలో లైవ్ స్టేటస్ ను చూడాలని సూచించారు. ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలన్నారు. ఒకవేళ కుదరని పరిస్థితులలో ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలన్నారు. చివరికి నిమిషంలో కంగారు పడకూడదన్నారు. ఆయా రైళ్లకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో లేదంటే సమీపంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. అవాంతరాలు లేని ప్రయాణాల కోసం రైల్వే పనులు జరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మున్ముందు వేగవంతమైన ప్రయాణం కావాలంటే ఈ అవాంతరాలను ప్రయాణీకులు ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: వేసవి రద్దీ నేపథ్యంలో రైల్వే కీలక నిర్ణయం, అందుబాటులోకి ఏకంగా 18,262 ప్రత్యేక రైళ్లు!