Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్.. త్వరలో పట్టాలెక్కనుంది. అధిక వేగం, మెరుగైన సౌకర్యం, భద్రతాతో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ కోల్ కతా-గువహటి మధ్య పరుగులు పెట్టనుంది. ఈ ట్రైన్ టికెట్ ఛార్జీలను రైల్వే శాఖ ఖరారు చేసింది. అధికారిక వర్గాల ప్రకారం.. 400 కి.మీ వరకు 3AC టికెట్ ధర రూ.960 నుంచి 3,500 కి.మీ వరకు.. 1AC టికెట్ ధర రూ.13,300 వరకు ఉంటుంది. 400 కి.మీ వరకు 3AC ఛార్జీలు రూ.960, 2AC ఛార్జీలు 1,240, 1AC ఛార్జీలు 1,520 నుండి ప్రారంభమవుతాయి.
దూర ప్రాంత ప్రయాణాలను తక్కువ సమయంలో చేరుకునేందుకు వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ను అందుబాటులో తెస్తు్న్నారు. వందే భారత్ చైర్ కార్ కు భిన్నంగా.. వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ ను వందల కిలోమీటర్ల దూరం.. రాత్రిపూట ప్రయాణాల కోసం రూపొందించారు. వందే భారత్ స్లీపర్ ప్రీమియం ఛార్జీలు భారీగా ఉన్నాయి. అయితే ఈ ట్రైన్ లో RAC, వెయిటింగ్ లిస్ట్ సదుపాయం లేదని రైల్వే శాఖ తెలిపింది. దూర ప్రాంత ప్రయాణాలకు వందే భారత్ స్లీపర్ అనుకూలంగా ఉంటుంది. ప్రయాణికుడు తక్కువ దూరం ప్రయాణించినప్పటికీ.. 400 కి.మీ దూరం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
AC 3-టైర్: కి.మీ.కు రూ. 2.4
AC 2-టైర్: కి.మీ.కు రూ. 3.1
AC ఫస్ట్ క్లాస్: కి.మీ.కు రూ. 3.8
AC 3-టైర్: రూ. 960
AC 2-టైర్: రూ. 1,240
AC ఫస్ట్ క్లాస్: రూ. 1,520
AC 3-టైర్: రూ.1,920
AC 2-టైర్: రూ. 2,480
AC ఫస్ట్ క్లాస్: రూ.3,040
AC 3-టైర్: రూ.3,840
AC 2-టైర్: రూ.4,960
AC ఫస్ట్ క్లాస్: రూ.6,080
3500 కి.మీ ప్రయాణానికి 1ఏసీ ఛార్జీలు రూ.13,300గా నిర్ణయించారు.
Also Read: ఒడియమ్మ.. టికెట్ లేకుండా ఏకంగా వందే భారత్ రైల్లో ప్రయాణం, వామ్మో ఇంత మందా?