Zero Civic Sense: భారత్ లో సివిక్ సెన్స్ జీరో అని మరోసారి రుజువైంది. వయస్సు, హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చేసే పని ఎక్కడ పడితే అక్కడ చెత్తను ఇష్టారీతిన పడేయడమే. మన దేశంలో పెరుగుతున్న “జీరో సివిక్ సెన్స్” గురించి సోషల్ మీడియాలో మీమ్స్ చర్చలు కొనసాగుతున్న సమయంలో మరో వీడియో వైరల్ అవుతుంది. రైలులో ప్రయాణిస్తు్న్న ఓ పోలీసు అధికారి.. తన సీటు కిందే చెత్తను పడేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ వైరల్ వీడియోలో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI) వేరుశెనగలు తిని.. ఆ తొక్కలను రైలులో కింద వేశారు. దీంతో ఆ కోచ్ చెత్తగా మారింది. ఏఎస్ఐ ఫోన్ మాట్లాడుతూ.. వేరుశెనగల తొక్కలు ట్రైన్ లో పడేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. పోలీస్ అధికారి నిర్లక్ష్యపు ప్రవర్తనను తోటి ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
BIHAR POLICE SHAMED! 🚨 ASI Caught ‘Cleaning’ Peanuts, Not Crime!
A video from Bihar is currently going viral, and it’s for all the wrong reasons. A Bihar Police ASI (Assistant Sub-Inspector) was caught on camera showing 0% Civic Sense inside a train compartment.
In a blatant… pic.twitter.com/PZpx8NSFmx
— Jon Snow 🐲♥️ (@Targaryen__Agon) January 30, 2026
ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒక పోలీస్ అధికారి నిర్లక్ష్యంగా ప్రవర్తించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారి రైలులో చెత్త పోయడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. రైలులో చెత్త వేయకుండా పోలీసును ఎందుకు ఆపలేదని మరికొందరు అంటున్నారు. ఎవరూ అతడు చేస్తున్నది తప్పని చెప్పడానికి ధైర్యం చేయలేదంటున్నారు. తోటి ప్రయాణికులు ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోయారని ప్రయశ్నిస్తున్నారు. మరో ఎక్స్ యూజర్.. రైలును అలంకరించినందుకు ధన్యవాదాలు పోలీసు వాలా జీ అని చమత్కరించారు.
Also Read: పోలీసులు స్పందించలేదని ‘టవర్’ ఎక్కాడు.. కొత్తచెరువులో హైడ్రామా!