E-Paper
Advertisement

ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ టూరిస్ట్ ప్యాకేజీ.. ఏప్రిల్ 14న సికింద్రాబాద్ నుంచే

ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ టూరిస్ట్ ప్యాకేజీ.. ఏప్రిల్ 14న సికింద్రాబాద్ నుంచే

IRCTC Tourism Package: సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శనం పేరుతో IRCTC టూరిస్ట్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ యాత్ర ఏప్రిల్ 14న ప్రారంభమై, 24న ముగుస్తుంది. 10 రాత్రులు, 11 రోజుల పాటు కొనసాగే ఈ ప్రయాణంలో మొత్తం 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను సందర్శించుకోవచ్చు. మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం, త్రయంబకేశ్వరం, భీమా శంకరం, ఘృష్ణేశ్వరం వంటి జ్యోతిర్లింగ పుణ్య క్షేత్రాలు దర్శించుకోవచ్చు. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ లో మొత్తం 702 బెర్త్ లు అందుబాటులో ఉంటాయి. స్లీపర్- 160, 3rd AC- 490, 2nd AC- 52. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ట్రైన్ కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, హుజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణ జంక్షన్ స్టేషన్‌లల్లో ఆగుతుంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవకాశం ఉంది.

7 జ్యోతిర్లింగాల దర్శనం

ముందుగా ఉజ్జయినీలోని మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవచ్చు. అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం గుజరాత్ లోని ద్వారకాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ నాగేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి సోమనాథ్ చేరుకుని సోమనాథేశ్వరుడిని సేవించుకుంటారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని పుణేలోని అక్కడ భీమా శంకరం ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం నాసిక్ సమీపంలో పశ్చిమ కనుమల్లో వెలిసిన త్రయంబకేశ్వరాన్ని చేరుకుంటారు. దీని తర్వాత ఔరంగాబాద్ లోని ఘృష్ణేశ్వరుడిని దర్శిస్తారు. దీంతో ఈ యాత్ర పూర్తవుతుంది. ఔరంగాబాద్ నుంచి తిరిగి సికింద్రాబాద్ కు చేరుకుంటారు.

ఈ ప్యాకేజీలో

  • ఎకానమీ (స్లీపర్ క్లాస్) పెద్దలకు రూ. 17,600 , 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు రూ.16,300
  • స్టాండర్ట్ కేటగిరి 3AC.. పెద్దలకు రూ.26,700, పిల్లలకు రూ. 25,200
  • కంఫర్ట్ కేటగిరి (2AC).. పెద్దలకు రూ. 34,600, పిల్లలకు రూ. 32,800
  • ఈ ప్యాకేజీల్లో రైలు ప్రయాణం, హోటల్ వసతి, బ్రేక్ ఫాస్ట్, లండ్, డిన్నర్, అలాగే స్థానిక దేవాలయాల దర్శనాల కోసం బస్సు సౌకర్యం ఉంటుంది.

IRCTC వెబ్‌సైట్ www.irctctourism.com ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో జ్యోతిర్లింగ దర్శించుకోవాలనుకునే భక్తులకు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మంచి అవకాశం. టికెట్ల అమౌంట్ చెల్లింపులకు ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తుంది ఐఆర్సీటీసీ.

Also Read: ఈ సమ్మర్‌లో షిల్లాంగ్ వెళ్తున్నారా.. అయితే మీరు చూడాల్సిన 5 అద్భుత ప్రదేశాలు!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×