E-Paper
Advertisement

11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు ద‌గ్దం.. బస్సులో 21 మంది ప్రయాణికులు

11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు ద‌గ్దం.. బస్సులో 21 మంది ప్రయాణికులు
Advertisement

Vempalli RTC Bus Fire Accident: వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి మండలంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. మండలంలోని వీరన్నగట్టుపల్లి గ్రామ సమీపంలో 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు పూర్తిగా దహనమైంది. కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేంపల్లి నుండి కదిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు వెళ్తున్న క్రమంలో పైన ఉన్న విద్యుత్ తీగలు బస్సు టాప్‌కు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సుపై మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును ఆపివేశారు. దీంతో ప్రయాణికులందరూ హుటాహుటిన బస్సు నుండి కిందకు దిగిపోయారు. ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు అంతటా వేగంగా వ్యాపించాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రాణనష్టం తప్పిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

మంటలు క్రమక్రమంగా బస్సు మొత్తం వ్యాపించడంతో ఆర్టీసీ బస్సు పూర్తిగా అస్థిపంజరంలా మారిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దహనమైంది. విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also: అమెరికాకు వరుస షాకులు.. రెస్క్యూ విమానం కూల్చివేత.. సొంత విమానాలనే పేల్చివేసిన అమెరికా సైన్యం..

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×