Ashu Reddy:సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి మరోసారి ఇంటర్నెట్ను షేక్ చేసింది. నిన్న మొన్నటి వరకు తనపై ఉన్న చీటింగ్ కేసుతో వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ, సడెన్గా ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అసలు అషుకి నిశ్చితార్థం అయిపోయిందా? ఆ వ్యక్తి ఎవరు? అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్న సమయంలో, తాజాగా అసలు విషయాన్ని బయటపెట్టి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఆ ఫోటోల వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు రివీల్ అయ్యింది. ఆ వివరాలు చూద్దాం..
అషురెడ్డి ప్రయాణం చిన్న వీడియోలతో మొదలైంది. సమంత పోలికలతో ఉండటంతో ఆమెకు “జూనియర్ సమంత”గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక అదే క్రేజ్తో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మతో చేసిన ఓ బోల్డ్ ఇంటర్వ్యూ ఆమె కెరీర్కు ఒక్కసారిగా హైప్ తీసుకొచ్చింది. అప్పటి నుండి గ్లామర్ ఫోటోషూట్లు, రీల్స్తో అషూ ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటోంది.
అయితే కెరీర్ బాగున్న సమయంలోనే అషు రెడ్డి ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. లండన్కు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అషు రెడ్డి మరియు ఆమె తల్లి రూ. 9.35 కోట్లు తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ కేసు విచారణపై స్టే ఇవ్వాలని ఆమె హైకోర్టును కోరినప్పటికీ, న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఈ కేసు గొడవ జరుగుతుండగానే, అషు తన ఇన్స్టాగ్రామ్లో ఎంగేజ్మెంట్ ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఒక వ్యక్తితో ఉంగరాలు మార్చుకుంటున్నట్టు ఉండటంతో, అందరూ ఆమె పెళ్లి చేసేసుకుంటోందని నమ్మేశారు. అయితే ఆ ఫోటోల్లో వరుడి మొహం కనిపించకుండా జాగ్రత్త పడింది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లతో అషును ఉక్కిరిబిక్కిరి చేశారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోయారు.
చివరికి ఈరోజు అషు ఆ ఫోటోల వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టింది. ఆ ఎంగేజ్మెంట్ ఫోటోలు నిజమైనవి కావు, అవి ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ (VOD) అనే వెబ్ సిరీస్ షూటింగ్ లోని సీన్స్ అని తేల్చి చెప్పింది. ఆ సీన్లో ఆమెతో ఉన్నది మరెవరో కాదు, బుల్లితెర నటుడు నిఖిల్ మలియక్కల్. “కంటికి కనిపించేవన్నీ నిజం కావు.. గుడ్డిగా నమ్మకండి” అంటూ ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ జియో హాట్ స్టార్ కోసం సిద్ధమవుతున్న విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ లో భాగంగా ఇలా నిఖిల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీడియోని ఇప్పుడు షేర్ చేసింది.
జనాలని అటెన్షన్ కోసమే ఇలా చేశానంటూ అషు రెడ్డి తన పోస్ట్లో సారీ చెప్పింది. “జనాలు దేనినైనా ఎలా నమ్ముతారు,అందరి కళ్ళు ఆకర్షించడానికి విషయాలను ఎలా రంగులు అద్ది చూపిస్తారో చెప్పడానికే నేను ఇలా చేశాను.. దయచేసి అర్థం చేసుకోండి” అని ఆమె క్లారిటీ ఇచ్చింది. దీంతో అషుకి పెళ్లి కాలేదని తెలిసి ఆమె అభిమానులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
మొత్తానికి అషు రెడ్డి మరోసారి తన స్టైల్లో పబ్లిసిటీ ఎలా చేయాలో నిరూపించింది. ఒకవైపు సీరియస్ కేసు నడుస్తున్నా, మరోవైపు తన ప్రాజెక్ట్ ప్రమోషన్ కోసం ఇలాంటి ప్లాన్ వేయడం విశేషం.ఇక ఏది ఏమైనా, అషూ ఇచ్చిన ఈ ట్విస్ట్ మాత్రం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
also read:సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ మృతి.. అసలేమైందంటే?