Intinti Ramayanam Pranathi : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో స్టార్ మా సీరియల్స్ ఎక్కువగా ఉన్నాయి.. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన స్టార్ మా ఎప్పటికప్పుడు జనాలని ఆకట్టుకునే విధంగా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తుంది. ఇటీవల కాలంలో దాదాపు మూడు సీరియల్స్ కొత్తగా ప్రారంభమయ్యాయి.. ఎన్ని సీరియల్స్ ప్రారంభమైన కూడా పాత సీరియల్స్ కి గట్టి పోటీని ఎలా ఉన్నాయి. ఇప్పటివరకు ప్రారంభమైన సీరియల్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉండడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు వచ్చే సీరియల్స్ లలో ఇంటింటి రామాయణం సీరియల్ ఈ మధ్య కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది.. పల్లవి అవనీల మధ్య పోటో పోటీ ఏర్పడుతుంది. వీళ్లతో పాటుగా ఈ సీరియల్కు ఎక్కువగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అంటే ప్రణతి. ప్రస్తుతం ఈ క్యారెక్టర్ ఇకమీదట కనిపించదు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…
ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మాల ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ మొదటి వరుసలో ఉంది.. ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటులు ఒక్కొక్కరు తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నారు.. రాజేంద్రప్రసాద్ ఇంటి ఆడబిడ్డగా ప్రణతి పాత్రలో నటించింది ప్రియా ప్రసాద్.. ఈమె గురించి ఈ ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించిన ఈమె ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఇప్పుడు ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. నిజానికి ఈమెకు చేతినిండా సీరియల్స్ ఉండడంతో ముందుగా కమిట్ అయిన సీరియల్స్ కారణంగా ఈ సీరియల్ నుంచి తప్పుకుని అవకాశాలు ఉన్నట్లు వార్తలు అయితే గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు మరోసారి ఇలాంటి వార్తలు వినిపించడంతో నిజంగానే ఈమె సీరియల్ నుంచి తప్పుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.. ఈ వార్తలకి చెక్ పెట్టాలంటే ప్రియాప్రసాద్ రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
సీరియల్ నటి ప్రియా ప్రసాద్ అందరికీ తెలిసే ఉంటుంది.. ఈమె జీ తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సీరియల్ చి ల సౌ లక్ష్మీ సౌభాగ్యవతి లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఆ తర్వాత స్టార్ మాలో ప్రసారమైన మరో హిట్ సీరియల్ ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ లో కూడా ఈమె కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు ఇంటింటి రామాయణంలో నటిస్తుంది. దీంతో పాటుగా మరో రెండు సీరియల్స్ లలో నటిస్తున్నట్లు సమాచారం.. అంతే కాదు గతంలో ఈయన సినిమాలలో కూడా నటించిందని తెలుస్తుంది.. ఏది ఏమైనా కూడా అమాయకమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరింది ప్రియా ప్రసాద్. ఇప్పటివరకు పద్ధతిగా ఉండే పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇకముందు ఎలాంటి పాత్రల్లో నటిస్తుందో చూడాలి..