Kissik talks:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరించే షోలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి. గత 9వ సీజన్లో కామనర్ గా అడుగుపెట్టిన డాక్టర్ ప్రియా శెట్టి అందరికీ గుర్తుంటుంది. ఆమె చదివింది మెడిసిన్ అయినప్పటికీ తల్లిదండ్రుల సపోర్టుతో తాను బిగ్ బాస్ షో కి అప్లై చేసి కామన్ మ్యాన్ క్యాటగిరి లో అగ్నిపరీక్షా సోలో సత్తా చాటి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ప్రియా శెట్టి బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ కిస్సిక్ టాక్స్ షోలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
యాంకర్ వర్ష మీరు అందంగా ఉండడానికి కారణం ఏంటి అని అడగగా? అందుకు ప్రియా బాగా తింటా అని చెప్పగా.. వర్ష వెంటనే అబ్బాయిల హార్ట్ అనగానే చిరునవ్వు చిందించింది. ఏ దేవుడిని మీరు నమ్ముతారు అని ప్రశ్నించగా ప్రతి దేవుడికి శక్తి ఉంటుందని నేను నమ్ముతాను. అలా నేను దుర్గమ్మ దర్శనం చేసుకున్నానో లేదో ఆ వెంటనే నాకు అగ్నిపరీక్ష నుంచి కాల్ వచ్చింది అని తెలియజేసింది. ఇక హౌస్ లో ఉండే వాళ్ళకి థాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెబుతావని ప్రశ్నించగా? అందుకు ప్రియా.. కళ్యాణ్ కి చెబుతాను.. కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, తనమీద ఓవర్ ప్రొటెక్టివ్ గా మారిపోతూ ఉంటానని తెలిపింది.
వర్ష మాట్లాడుతూ .. మీరూ సింగిలా లేదా ఆల్రెడీ కమిట్ అయ్యారా అని అడగగా! అందుకు ప్రియా లేదు లేదు ఐ యాం సింగిల్ అంటూ సమాధానాన్ని చెబుతుంది. అలాగే తన కాబోయే బాయ్ఫ్రెండ్ ఎలా ఉండాలి అనే విషయం పైన మాట్లాడుతూ.. నేను ఎక్కువగా కేర్ చేస్తాను, ఎక్కువ ప్యాంపర్ చేస్తాను, కొంచెం రొమాంటిక్ నేను అంటూ ఆనందంతో ప్రియా శెట్టి తెలియజేస్తుంది. లోకమందరికీ విలన్ లా ఉండాలి, నా దగ్గరికి వచ్చేసరికి హీరోలాగా ఉండాలి. లుక్స్ విషయం పైన మాట్లాడుతూ.. తనకు డార్క్ అబ్బాయిలు చాలా ఇష్టమని తెలియజేసింది ప్రియా శెట్టి.. మొత్తానికైతే తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ గురించి.. కాబోయే వాడి గురించి తన కోరికలు బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.
also read:తొక్కలో ఇంటర్వ్యూ.. జాఫర్ పై ఫైర్ అయిన గెటప్ శ్రీను!
ఫస్ట్ లవ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. అయితే ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది అనేది నేను నమ్ముతాను. ఏ బంధాన్ని అయినా సరే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటూ తెలిపింది. ఇక మనం కాపాడుదామని ఎంత చూసినా ఆ బంధం విడిపోవాలని చూస్తే.. ఏం చేయాలి? అని వర్ష అడగగా.. విడిపోవడమే మంచిది. ఒక బంధం విడిపోవాలనుకున్నప్పుడు మనం ఎంత బలంగా పట్టుకున్నా ఆ నొప్పి మనకే కాబట్టి విడిపోవడమే మంచిది అంటూ తెలిపింది.