Karthika Deepam 2 jyo : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు కార్తీకదీపం 2. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రోజురోజుకీ మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంటుంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సీరియల్లో ప్రతి క్యారెక్టర్ కూడా హైలెట్గా నిలుస్తుంది. ఇందులో నటించే ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. హీరో హీరోయిన్ తర్వాత హైలైట్ అయిన క్యారెక్టర్ విలన్ గా నటించిన జ్యోత్స్న.. గత సీజన్ కి విలన్ గా మౌనిత నటించగా ఈ భాగంలో ఈమె కనిపించింది.. మౌనిత పాత్రని మైమరిపించేలా ఈమె విలనిజంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. అయితే ఈ పాత్రలో నటించిన ముద్దుగుమ్మ అసలు పేరు గాయత్రి సింహాద్రి. ఈమె గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తన నటనతో మెప్పిస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు మతిపోగోడుతుంది. మరి నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
సీరియల్ హీరోయిన్ గాయత్రి సింహాద్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల మనసులో నటిగా చెరగని ముద్ర వేసుకుంది. ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ వచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం విలన్ గా భయపెడుతుంది. అయితే ఈమె సోషల్ మీడియాలో ఈ మధ్య గ్లామర్ గేట్లు ఎత్తేసింది. ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ వచ్చిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హాట్ అందాలతో కుర్రకారుని రెచ్చగొట్టేస్తుంది. ఈమె ఫోటోలకు డిమాండ్ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి గాయత్రి సోషల్ మీడియా ద్వారా దాదాపూగా నెలకు 15 లక్షల వరకు సంపాదిస్తుంది అని ఓ వార్త చక్కర్లు… ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సబ్స్క్రిప్షన్ ఆప్షన్తో బాగానే సంపాదిస్తున్నారు అన్న వార్త వాస్తవం. ఇప్పుడు ఇది కూడా నిజమే అని జనాలు నమ్ముతున్నారు. మరి దీనిపై గాయత్రి ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి..
విజయవాడకు చెందిన ఈ అమ్మడు విశాఖపట్నంలోని తన కెరియర్ ని ముందుకు సాగించింది. చదువు తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ వచ్చింది.. మిసెస్ వైజాగ్ వంటి కొన్ని టైటిళ్లను కూడా గెలుచుకుంది. 2022లో తెలుగు ఛానల్లో ప్రసారమైన ‘త్రినయని’ సీరియల్తో బుల్లితెరపై అడుగుపెట్టింది. మొదటి సీరియల్ తోనే మంచి టాక్ని సొంతం చేసుకున్న ఈమె ఆ తర్వాత వరుసగా సీరియల్స్ చేసే అవకాశాలను అందుకుంటూ వచ్చింది. ఒకవైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు సీరియల్స్ చేస్తూ తన కెరీర్ ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లింది గాయత్రి సింహాద్రి. ప్రస్తుతం కార్తీకదీపం 2 లో నటిస్తున్న ఈమె ఒక్క రోజుకి దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..