Gundeninda GudiGantalu Today episode February 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా కట్టుతో వచ్చిందని చూసిన ప్రభావతి ఏమైంది అని అడుగుతుంది.. ఏంటి ఇది కొత్తరకం డ్రామానా ఏంటి అని ప్రభావతి వచ్చి రాగానే అడుగుతుంది.. ఏం మాట్లాడుతున్నావ్ ప్రభ మీనా బండి మీద నుంచి కింద పడిపోయింది తలకి దెబ్బ తగిలింది. ఎప్పుడైనా మనిషిలాగ మాట్లాడు అని సత్యం అంటాడు. బండి ఉంది కదా అనేసి ఓవర్ గా వెళ్తే ఇలానే ఉంటుంది. పెద్ద దెబ్బ తగిలిందా ఏంటి అని వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి.. మీనాని మొదటిసారి అలా అడగడంతో అందరూ షాక్ అవుతారు.. ఏంటి ఇలా జరిగింది ఏంటి ఈవిడ ఇలా అడుగుతుంది ఏంటి అని బాలు కూడా షాక్ అవుతాడు. అయితే మీనా మీద ఇలాంటి కాన్సల్ చూపించడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇంత మార్పు ఏంటి అని ఆలోచనలో పడతారు.అయితే ఇప్పుడు వంట ఏం చేస్తున్నావు అని అడగడంతో సత్యం ప్రభా ఎలాంటి పరిస్థితిలో ఉందో నువ్వు ఆలోచించవా అని అడగడంతో.. సరే సరే అర్థమైంది ఆ వంట ఏదో చేసుకుంటాను..
ఎక్కడికి వెళ్లకుండా ఒక నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పండి. ఇప్పుడు వెళ్లి పడుకోమని చెప్పండి నేను వంట సంగతి చూస్తాను అని ప్రభావతి అనడంతో సత్యం ఇంత మంచి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతాడు.. ప్రభావతి ఇంకా వంట గదిలోకి వెళ్లి వచ్చి ఏడాది కూడా అవలేదు వంటగది మొత్తాన్ని మార్చేసింది అని మీనా పై ఒకవైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు ఎత్తి పొడుస్తుంది… మొత్తానికి ప్రభావతి తన వంటతో జనాలని భయపెట్టడానికి రెడీ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆ గుణాని కలిసి అతని దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తాను అని రోహిణి అంటుంది. వీడ పీడ విరగడైపోతే మనోజ్ తో నేను చాలా సంతోషంగా ఉంటాను అని రోహిణి అంటుంది. అని రోహిణి అక్కడికి వెళ్లి దినేష్ కి డబ్బులు కాకుండా వాడికి వార్నింగ్ ఇవ్వమని అడుగుతుంది.. నేను నీకు ఫెవర్ చేస్తాను కానీ నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి అని గుణ అడుగుతాడు.. బాలు మీ మరిదే కదా అని రోహిణి అని అడుగుతాడు. అవును మామ మరిది అయితే ఇప్పుడేం చేయాలి అని అడుగుతుంది రోహిణి.. ఏం లేదు ఆయన బామ్మర్ది శివ గురించి మీకు తెలిసే ఉంటుంది.. ఒకసారి మీ అత్తయ్య తన డబ్బులు పోయింది అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది గుర్తుందా అని అనగానే అవును నాకు గుర్తుంది ఇప్పుడు అది ఎందుకు అడుగుతున్నావు అని రోహిణి అంటుంది.
ఆ డబ్బులు కొట్టేసింది ఎవరో కాదు మీనా వాళ్ళ తమ్ముడు బాలు బామ్మర్ది శివానే.. ఒకసారి వాడు ఏదో వాళ్ళ ఇంటికి వెళ్తే తనని అవమానించిందని ఇలాంటి పని చేశాడు కావాలంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా బాలు ఫోన్లో ఉంటుంది అది నాకు తెచ్చి ఇస్తావా అని అడుగుతాడు.. ఇదంతా జరిగింది అందుకేనా అందుకే నా బాలు చేయి విరగగొట్టాడు అని రోహిణి అనుకుంటుంది. ఆ విషయం తెలిసే బాలు శివ చేయి విరగొట్టాడు అని గుణ చెప్పగానే రోహిణి షాక్ అవుతుంది.. ఎలాగైనా సరే ఈ విషయాన్ని ఇంట్లో తెలియనివ్వకుండా గుణానికి వీడియో తెచ్చి వాళ్ళని అనుకుంటుంది.. సరే నేను ఆ పని చేస్తాను మీరు నాకు ఈ పని చేసి పెట్టండి అని రోహిణి అడుగుతుంది..
తర్వాత మీనా పడుకుని ఉండగా చూసిన రవి శృతి ఏమైంది వదినకు అని టెన్షన్ పడిపోతారు. బండి మీద వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది. అందుకే తలకు కట్టు కట్టారు అని అనగానే వాళ్లందరూ కూడా టెన్షన్ పడిపోతారు.. ఆ తర్వాత రాత్రి శృతి అడుగుతుంది. నాకేమీ పర్వాలేదు బాగానే ఉంది అని అనగానే నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఏ పని చేయకూడదు అని రవి శృతి అంటారు.. ఇక తర్వాత వంట చేశారా అని రవి అడగ్గాని అవును అమరావతి చేసింది అని బాలు అంటాడు.. అమ్మో ఇప్పుడు ఆ ప్రయోగాన్ని నేను ట్రై చేయాలా నాకొద్దు మన వెళ్లి రెస్టారెంట్లు తినేసి వద్దాం పద అని శృతి రవి బయటకు వెళ్లిపోతారు..
అప్పుడే రోహిణి అక్కడికి వస్తుంది.. ఎక్కడికి వెళ్ళావ్ అమ్మ రోహిణి ఇంత ఆలస్యమైంది అని ప్రభావతి అడిగితే నేను ఒక గుడికి వెళ్లి పూజ చేయించుకుని వస్తున్నాను అత్తయ్య అని రోహిణి అంటుంది.. ఏంటమ్మా ఏంటా పూజ ఏం చేసావు అని అడిగితే నేను ఒక స్వామీజీని కలిసాను అక్కడ అందరి జాతకాలు బాగున్నాయని చెప్పారు. కానీ మీ నా జాతకం మాత్రం బాగోలేదు. తనకి కష్టాలు వెంటాడుతున్నాయని చెప్పాడు అని చెప్పగానే మీనా టెన్షన్ పడిపోతుంది.. మా ఒక్కరి గురించి చెప్పాడా మీ గురించి చెప్పలేదా అని బాలు కూడా సెటైర్లు వేస్తాడు.. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేద్దామని వస్తారు.. ఈరోజు వంట మనిషి అక్కడ కనిపించలేదు అని మీనా అని దారుణంగా అవమానించేలా మాట్లాడుతాడు.. అదే వంట చేసే మనిషి కనిపించలేదు లీవ్ పెట్టిందని మనోజ్ అడుగుతాడు..
Also Read :అక్షయ్ కు నిజం చెప్పిన అవని..దొంగగా మారిన పల్లవి.. లాయర్ ఎంట్రీతో దిమ్మతిరిగే షాక్..
మీనాకు దెబ్బ తగిలింది అందుకే ఇవాళ అమ్మ వంట చేసింది ఆ అదృష్టం నీకే దక్కింది అని బాలు అంటాడు. ఏంటి అమ్మ వంట చేసిందా అయితే నేను బయట తినేసి వస్తాను అని అనగానే ప్రభావతి రేయ్ ఎక్కడికి వెళ్తావ్ రా.. నువ్వు ఇప్పుడు తినాల్సిందే అని పట్టుబట్టి మరీ కూర్చోబెట్టి వంట పెడుతుంది. ప్రభావతి చేసిన వంటని చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ వంటలు తిన్న రోహిణి మనోజ్ ఇద్దరు కూడా కారంతో చచ్చిపోయామని అంటారు. బాలు సత్యం మాత్రం తెలివిగా ఎస్కేప్ అవుతారు.. ఇక రాత్రి సత్యం కోసం ప్రభావతి స్వీట్ చేసి ప్రేమగా తినిపిస్తుంది.. మీనా రోహిణి చెప్పిన విషయాన్ని తలుచుకొని ఉలిక్కిపడి లేసి టెన్షన్ పడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో శివ గురించి ఇంట్లో రోహిణి చెప్పేస్తుందా చూడాలి..