Gundeninda GudiGantalu Today episode may 30th : మీనా పూలు ఇచ్చి బయటకి వస్తూ ఉండగా ఆమె బాక్స్ ని ఒక వ్యక్తి తీసుకుని పారిపోతూ ఉంటాడు. అది చూసిన మీనా అతని వెనకాలే పరిగెడుతూ వస్తుంది.. ఒక ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఒక ఆవిడ భోజనం చేయండి అని ఎంతగా అడుగుతున్నా సరే నా బాక్స్ నాకు ఇవ్వండి అని నేను అంటుంది.. అయితే చివరికి అది చింతామణి ఇల్లు అని తెలిసిపోతుంది. అయితే చింతామణి మనిద్దరం కలిసి బిజినెస్ చేద్దామని బంపర్ ఆఫర్ ఇస్తుంది. నేను ఎప్పుడు కష్టపడి చేయాలనుకుంటాను.ఇలా కక్కుర్తి పడి చేసి తినాలని అనుకోను అని అంటుంది మీనా.. పులికి తోక లాగా ఉండడం కంటే పిల్లికి తలలాగే ఉండడం నాకు ఇష్టం. నేను కలిసి బిజినెస్ చేయను అని నేను తెగేసి చెప్తుంది..
మీనా తన బాక్స్ ని తీసుకుని వెళ్లిపోగానే.. ఏంటమ్మా గారు ఇలా జరిగింది అని తన అసిస్టెంట్ చింతామణితో అంటాడు.. ఏదైనా గాని చింతామణి దక్కించుకోవడంలో ముందుంటుంది. పిల్ల కాకి రా దీన్ని నా దారిలోకి తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు.. కేవలం కొద్ది రోజుల్లోనే దాన్ని నా దారికి తెచ్చుకుంటాను అని చింతామణి అంటుంది. కానీ ఈ మేన అందరి అమ్మాయిలాగా కాదు ఎలాగైనా సరే తనని భయపెట్టి బెదిరించి నా దారిలోకి తెచ్చుకుంటాను అని చింతామణి గట్టిగా ఫిక్స్ అవుతుంది . కానీ మీనా మాత్రం ఆవిడకి ఎంత దూరంగా ఉండి తన పనేదో తాను చేసుకోవాలని అనుకుంటుంది..
మనము ఎలాగైనా సరే పోగొట్టుకున్న 30 లక్షలు వాళ్లకి ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ల నోర్లు మూయించాలి అని మనోజ్ తో రోహిణి అంటుంది. మనం ఒకవేళ ఆ దొంగల్ని పట్టుకున్న సరే వాడు మొత్తం డబ్బులు ఇస్తాడని నాకు నమ్మకం లేదు అని మనోజ్ అంటాడు. వాడు కేవలం కొంతమంది డబ్బులు ఇచ్చిన మిగతా డబ్బుల కోసం అయినా మనం ఎవరినో ఒకరిని అడగాలి. దానికోసం వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు? మీ మామయ్య ని అడిగితే సరిపోతుంది కదా.. నువ్వు ముందు మీ మామయ్య నెంబర్ ఇవ్వు. నేను అతన్ని అడిగి ఎలాగైనా సరే డబ్బుల్ని ఏర్పాటు చేయమని చెప్తాను అని రోహిణి తో మనోజ్ అంటాడు. ఈ మనోజ్ ఎటు తిరిగి నా మీదకే వస్తున్నాడు ఎలాగైనా సరే 30 లక్షలు రాబట్టాలి అని రోహిణి గట్టిగా అనుకుంటుంది..
రోహిణి గురించి ఏం చెప్పిందని తెలుసుకునేందుకు రోహిణి కామాక్షి దగ్గరికి వెళుతుంది. ఏం అడిగారు.. మీరేం చెప్పారు ఎందుకు బాలు మీనాలకి నా గురించి పని ఏంటి అని కామాక్షిని అడుగుతుంది రోహిణి. వాళ్లు నా గురించి ఆరా తీస్తున్నారు. మీరేం చెప్పారా ఆంటీ అని రోహిణి అడుగుతుంది. నాకు మలేషియా గురించి తెలియదు అని చెప్పాను అని రోహిణి అంటుంది. కామాక్షి ఆంటీ దగ్గర కూడా వచ్చి అడిగారు అంటే నా గుట్టు బయట పెట్టేంత వరకు బాలు ఆగిన కనిపించడం లేదు. అసలు నా పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు అని రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎంతసేపు నేను పోరాడిన కూడా నా జీవితం మళ్లీ ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తుంది అని ఉంటుంది.
బాలుని కలిసిన మీనా విద్య ఏమి సమాధానం చెప్పలేదు. తను చెప్పేది అబద్ధమని నాకు బాగా అర్థమవుతుంది. కానీ రోహిణి గురించి నిజాలు మాత్రం మాట్లాడడం లేదు. రోహిణి అసలు మలేషియా కాదని నాకు అర్థం అవుతుంది. ఇన్ని రోజులు మా అమ్మ ఆవిడ గురించి గొప్పగా చెప్పుకుంది కదా.. ఆవిడకురా మలేషియా నుంచి ఇలా విసిరేస్తాను అని చెప్పింది కదా అసలు ఈ మలేషియా యవ్వారం ఏంటో తెలుస్తానని బాలు అంటాడు. ఎలాగైనా సరే రోహిణి మీద నాకున్న అనుమానం తీర్చుకుంటాను అని బాలు కంకణం కట్టుకుంటాడు.. నెక్స్ట్ ఎపిసోడ్ లో మాత్రం బాలు తన పనిని కానిచ్చి రోహిణికి షాక్ ఇస్తాడని అర్థమవుతుంది.. మలేషియా గుట్టు రట్టు అవుతుందేమో అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…