Bus Fire: నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సుకు నిప్పంటుకోని పూర్తిగా కాలిపోయింది. దీంతో బస్సులో దాదాపుగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
నల్గొండ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. చిట్యాల మండలం పెద్ద కాపక్తి వద్ద ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడకు బస్సు ప్రయానమై వెల్తుంది. ఈ క్రమంలొ ఇంజిన్లో సాంకేతిక లోపం వలన బస్సులోనుండి మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై చాక చక్యంగా వ్వవహరించాడు. అనంతరం ప్రయాణికులను క్షణంలోనే కిందికి దించి వారి ప్రాణాలను కాపాడాడు. ఈ ప్రయాందం చూసిన ప్రయాణికులు భయాందోళను గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటం వలన ప్రమాదం నుండి ప్రయాణికులు సురక్షితంగా భయట పడ్డారు. లేదంటే భారీ ప్రాణ నష్టం జరిగేదని అక్కడి స్థానికులు తెలిపారు.
Also Read: ఢిల్లీ పెద్దల ప్లాన్ను బయటపెట్టిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..!
ప్రయాణికుల కళ్లెదుటే ట్రావెల్ బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో ఉపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది సహయంతో మంటలు ఆర్పారు అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయునట్టు సమాచారం. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
నల్గొండ జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు
లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం
02:15 టైంలో ఇంజిన్ నుంచి వచ్చిన మంటలు
అప్రమత్తమై బస్సును నిలిపివేసిన డ్రైవర్
బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు సురక్షితం
ఘటనా స్థలానికి చేరుకుని… pic.twitter.com/f4orVxINrn
— BIG TV Breaking News (@bigtvtelugu) May 30, 2026
Also Read: తండ్రి దాచిన రహస్యం.. ముక్కలైన కుటుంబం: ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే ఫ్యామిలీ డ్రామా