Illu Illaalu Pillalu Chandu : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో సీరియల్స్ ఒకటి.. ఈ మధ్య తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ ఒకదానికి మించి మరొకటి అద్భుతమైన స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అదే ఎక్కువగా కుటుంబ కథా స్టోరీలు రావడంతో జనాలు వాటిని చూసేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. జనాలని ఎక్కువ ఆకట్టుకుంటున్న వాటిలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ ప్రసారం పట్టించి ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒక తండ్రి తన బిడ్డల కోసం తాపత్రయపడుతూ, తాను అవమానాలు పాలవుతూ ఉంటాడు.. అయితే తన బిడ్డలని ఎప్పుడూ గొప్పగా చూసుకోవాలని అనుకుంటాడు. హార్ట్ టచింగ్ స్టొరీ కావడంతోనే సీరియల్కు మంచి రేటింగ్ కూడా వస్తుంది. ఈ సీరియల్ లో మొదటి కొడుకు పాత్రలో నటించింది చందు. ఇతనే రియల్ నేమ్ ప్రశాంత్ కుమార్. ఈయన గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో పెద్ద కొడుకుగా చందు నటించాడు. ఇంటికి పెద్దకొడుకుగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ జనాలను బాగా ఆకట్టుకుంటున్నాడు. ఈయన రియల్ నేమ్ ప్రశాంత్ కుమార్. ఇతను చూడడానికి కన్నడ అబ్బాయిలా ఉన్నా కూడా తెలుగు అబ్బాయి. వైజాగ్ లో పుట్టి పెరిగిన ఇతను అక్కడే చదువును కూడా పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో సీరియల్స్ లలో అవకాశాల కోసం తిరిగాడు. మెల్లగా సీరియస్లలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. అయితే ఇతనికి పెళ్లి అయ్యిందన్న విషయం పై ఒక క్లారిటీ అయితే రాలేదు.. ఆయన సోషల్ మీడియా ఫోటోలలో ఓ అమ్మాయితో దిగిన పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. అతనికి పెళ్లి అయిందో లేదో అతను క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాలి.
ప్రశాంత్ బుల్లితెరపై ఎన్నో సీరియల్స్లలో నటించాడు. నాగ పంచమి, కుంకుమపువ్వు, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్లలో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్కో సీరియల్లో ఒక్కో విధంగా తన నటన ఉండడంతో జనాలు అతని నటనకు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే మిగిలిన సీరియల్స్ అన్నిటిలో కెల్లా పోలిస్తే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అందించింది.. చందు గా ఆడియన్స్ ను మెప్పిస్తున్నాడు. గతంలో వచ్చిన సీరియల్స్ తో పోలిస్తే ఇది మంచి టీఆర్పి రేటింగ్ కూడా సొంతం చేసుకోవడంతో అతని క్రేజ్ మరింత పెరిగింది. రామరాజు పెద్దకొడుకుగా కుటుంబంలో జరిగే వాటికి తాను బాధ్యత తీసుకుంటూ ఎవరిని నొప్పించకుండా ఉంటాడు. తన భార్యా చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మేస్తూ తన వాళ్లపై కొన్నిసార్లు కోపాన్ని పెంచుకుంటాడు.. కానీ చివరికి తన తమ్ముళ్లే తన ప్రాణం అని తెలుసుకుంటాడు. తమ్ముళ్లకు కష్టం వస్తే తాను ముందుండి చూసుకుంటాడు. ఈ సీరియల్ స్టోరీ జనాలను విపరీతంగా ఆకట్టుకోవడంతో ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇది రెండో స్థానంలో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇకపోతే ప్రశాంత్ ఈ సీరియల్కు ఒక రోజుకి 25 వేల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 25 రోజుల వరకు షూటింగ్ ఉండడంతో లక్షల్లో సంపాదిస్తున్నాడు చందు..