Intinti Ramayanam Today Episode April 21st: ఫైనాన్షియర్ ఇంటికి వస్తాడు.. చక్రధర్ గారికి ఆస్తులు లేకపోవడంతో ఆయన పెట్టిన సంతకం చెల్లదు. ఆయన ఇప్పుడు ఆస్తులు పోగొట్టుకున్నారని తెలిసింది.. డబ్బులు మీకు ఇవ్వడానికి కుదరదు గతంలో ఇచ్చిన డబ్బుల్ని కూడా మీరు వెంటనే తిరిగి ఇవ్వాలి అని ఫైనాన్షియర్ అనడంతో అక్షయ్ కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయితే అందరూ కలిసి పల్లవి మొహం చూడగానే మా మామకి అలాంటి అలవాటు లేదు అని పల్లవి అంటుంది.. కానీ పల్లవి మాత్రం రాజేశ్వరి దగ్గరికి ఆవేశంగా వెళ్లి భరత్ గురించి అడుగుతుంది.. తాను చెప్పిన సమాధానం విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది..
రాజేశ్వరి దగ్గరికి వెళ్లిన పల్లవికి రాజేశ్వరి చెప్పిన మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వు నీ భర్తని దూరం చేసినా దాని కొడుకుకి ఎందుకు దగ్గరవుతున్నావో అర్థం కావడం లేదు అని పల్లవి తల్లిని నిలదీస్తుంది.. నా భర్తని నాకు కాకుండా దూరం చేసిన దానికి దాని కొడుకుని దూరం చేయడానికి నేను ఈ ప్లాన్ చేశాను.. శాశ్వతంగా తన కొడుకుని తనకి దూరం చేసే నాకు దగ్గర చేసుకుంటాను అని రాజేశ్వరి అనగానే పల్లవి ఫిదా అయిపోతుంది.. నీ బ్రెయిన్ సూపర్ మామ్ నువ్వు చేసింది కరెక్ట్ అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తుంది. రాజేశ్వరి తీరుపై భానుమతి మాత్రం అసహనం వ్యక్తం చేస్తుంది.
చక్రధర్ ని భరత్ తోసి వేయడం చూసిన మీనాక్షి బాధపడిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు మిమ్మల్ని తోసివేయడం నేను చూశాను అని మీనాక్షి అనగానే తన ఆవేశంలో కూడా తప్పులేదు కదా అని చక్రధర్ అంటాడు. వాడు ఎప్పటికీ మారతాడు అర్థం కావడం లేదండి. నాన్న లేడు అని బాధపడ్డాడు కానీ ఇప్పుడు అదే నాన్నని బాధ పెడుతున్నాడు అని మీనాక్షి అంటుంది. వాడు ఇంకా రాలేదు అని ప్రనతిని అడగగానే తను బయటికి వెళ్ళాడు కదా అత్తయ్య అని ప్రణతి అంటుంది.. ఫోన్ చేయగానే రాజేష్ వాళ్ళ దగ్గర ఉన్నాను అని అనగానే చక్రధర్ షాక్ అవుతాడు.
ఉదయం 8:30 అయినా సరే అవని ఇంకా నిద్ర లేవకపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. పార్వతి దగ్గరికి వెళ్లి ఏంటి అత్తయ్య మీరు ఇంకా పడుకున్నారు లేవలేదు ఏంటి? అని అడగ్గానే రాత్రి టైం అయింది అమ్మ నిద్రపోవడంతో పొద్దున నిద్ర పట్టింది అని అంటుంది.. మీరు లేవండి మీకోసం టిఫిన్ చేసుకొని వస్తాను అని అవని అంటుంది. వంటగదిలోకి వెళ్ళగానే అక్షయ్ అక్కడ టిఫిన్ చేసి తీసుకొని వస్తాను అని అంటాడు. పార్వతికి టిఫిన్ ఇచ్చిన అక్షయ్ మనం ఈరోజు ఆఫీస్ కి వెళ్ళాలి శ్రీకర్ ను కుడా రెడీ అవమను అని అనగానే ఎమోషనల్ అవుతుంది. తన కొడుకు తిన్నాడో లేదో అని బాధపడిపోతూ ఉంటుంది.
చక్రధర్ కి తన మనుషులు ఫోన్ చేసి అక్షయ్ కి షూరిటీ సంతకం పెట్టారు కదా.. మీ దగ్గర ప్రాపర్టీస్ ఏమీ లేవు అని అతను డబ్బులు కట్టమని కోరాడట అని చెప్తాడు. ఆ మాట వినగానే చక్రధర్ అవనికి ఫోన్ చేసి నేను నీతో అక్షయతో ఒక విషయం చెప్పాలి మీరు అర్జెంటుగా రండి అని ఒక లొకేషన్ ని పంపిస్తాడు.. అక్కడికి వచ్చిన అవని అక్షయలకు చక్రధర్ తన ప్రాపర్టీస్ అన్ని రాజేశ్వరి పేరు మీదకు వెళ్ళగానే ఆ ఫైనాన్స్ ఇయర్ డబ్బులు ఇవ్వనని అన్నాడట నాకు ఇందాకే తెలిసింది అని అడుగుతాడు. నాన్న మరేం పర్లేదు దాని గురించి మేము ఆలోచిస్తాము అని అనగానే ఏం అవసరం లేదమ్మా.. ఇందులో 50 లక్షల డబ్బులు ఉన్నాయి మీరు తీసుకోవాల్సిందని బలవంతంగా ఆ డబ్బులు వాళ్లకు ఇస్తాడు. ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో భరత్ కారులో రావాలని చూసి అవన్నీ షాక్ అవుతుంది. అలా కనిపించడంతో అవని అక్షయలు ఎంతగా అడుగుతున్న సరే భరత్ మాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మిస్ అవ్వకుండా చూడాలి..
Also Read :’ ఇళ్లు ఇల్లాలు పిల్లలు ‘ కొత్త ప్రేమ బ్యాగ్రౌండ్.. ఇదేం ట్విస్ట్..