Intinti Ramayanam Today Episode july 22nd: ఉదయం లేవగానే శ్రీయా అందరిని రమ్మని పిలుస్తుంది.. అయితే ఏమైంది శ్రేయ ఎందుకు అందని రమ్మని పిలిచావని చెప్పగానే.. ఆగండి అత్తయ్య మీకోసం నేను ఒక ప్లాన్ చేశాను ఆవిడ వస్తుంది అని చెప్పగానే.. ఎవరు ఆవిడని అందరూ ఎదురు చూస్తూ ఉండగా శ్రీ ఆ మాత్రం టీచర్ అని పిలవగానే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.. అక్కడికి వచ్చిన యోగా టీచర్ని చూసి అందరూ ఒక్కసారి షాక్ అవుతారు. శ్రీ అ కాన్సెప్ట్ బాగానే ఉన్నా కూడా వాళ్ళు మాత్రం యోగ ఆసనాలు చేయలేక అక్కడి నుంచి ఒక్కొక్కరిగా మెల్లగా జారుకుంటారు. పల్లవికి మాత్రం కోపం తగ్గేందుకు ఇచ్చిన ఆసనం ఫెయిల్ ఈ పల్లవి కింద పడిపోతుంది అందరూ నవ్వుతారు.. ఇక ఒక్కొక్కరు యోగా నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి వెళ్ళిపోతారు..
యోగ టీచర్ చెప్పినవన్నీ చేయడానికి అందరూ సిద్ధంగా ఉండకపోవడంతో ఎవరికి వారు అక్కడి నుంచి ఏదో ఒక సాకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యోగ చేయలేము అని చెప్పలేక వాళ్ళందరూ వెళ్లిపోవడంతో యోగా టీచర్ చాలా ఫీల్ అవుతుంది.. కేవలం నువ్వు రమ్మంటేనే నేను ఇక్కడికి వచ్చాను అని శ్రీయాతో అంటుంది. ఇక కమల్ బాధపడకండి ఆరోగ్యశ్రీ టీచర్ గారు మా బావకి కీళ్లనొప్పులు కాళ్ల నొప్పులు అన్నీ ఉన్నాయి. ఆమెని మీరు మీకు ఇష్టమైన యోగాలు నేర్పించి ఆమె రోగాలన్నీ మాయమయ్యాల చేయండి అని కమల్ అనగానే భానుమతి అడ్డంగా బుక్కయ్యను అని అనుకుంటుంది. టీచర్ చెప్పిన ఒక్క ఆసనం చేతులు ఇరుక్కుపోయాయని బాధ పడిపోతూ ఉంటుంది.
శ్రియ బాబుని చూస్తూ ఆడుకుంటూ ఉండగా శ్రీకర్ అక్కడికి వచ్చి ఇప్పుడు నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీయా అని అంటాడు.. ఒకప్పుడు నిన్ను చూస్తే నాకు చాలా భయమేసేది పిల్లలు నువ్వు ఎలా పెంచుతావు అని బాధపడే వాడిని.. కానీ ఇప్పుడు నువ్వు ఇంతగా మారిపోవడం చూసి నాకు ఇప్పుడు మళ్లీ నిన్ను కొత్తగా ప్రేమించాలని అనిపిస్తుంది. ఎంతగా మారిపోయావు అంటే ఒకప్పుడు కేవలం డబ్బులు అని ఆలోచించడానికి ఇప్పుడు కుటుంబాలు ఆత్మీయతల గురించి బాగా తెలుసుకున్నావు అనే శ్రీకర్ తనని పొగడ్తల వర్షం కురిపిస్తాడు.. అయితే శ్రేయ శ్రీకర్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా బాబుతో ఉంటారు..
పల్లవి అవని అక్క చెప్పిన టైం దగ్గర పడిపోయింది నగల గురించి నన్ను అడిగితే నేనేం చేయాలి ఆ అశ్విన్అడిగితే వాడు చచ్చినా నాకు ఇవ్వడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు ఆ నగల గురించి నేను ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆలోచిస్తూ.. అత్తయ్య గారి నగలు అనే తీసుకుని వెళ్లి వాటిని గిల్టు నగలుగా తయారు చేయించి ఆ డబ్బులతో బాబుకి నగలు చేయించాలి అని అనుకుంటుంది.. అయితే పార్వతి దగ్గరికి వెళ్లి నగలను అడగగానే పార్వతి తాళం నా దగ్గర లేదమ్మా అవని దగ్గర ఉంది నీకు ఏ నగలు కావాలన్నా అవన్నీ వెళ్లి అడుగు నీకు వెంటనే ఇస్తుంది అని చెప్తుంది.. అవని దగ్గర ఉంటే అవని ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది కానీ నాకు నగలు ఇవ్వదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. మీనాక్షి చెప్పిన మాట గుర్తు చేసుకొని వాళ్ళ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని అనుకుంటుంది.
అక్షయ్ రెడీ అవుతూ ఉండగా ఆరాధ్య రెడీ అయ్యి అవని దగ్గరికి బ్యాగు తీసుకుని వస్తుంది.. అవని ఆ బ్యాగ్ మొత్తాన్ని చూసి అందులో ప్రోగ్రెస్ రిపోర్టు ఉండటం చూసి ఎందుకు నాకు నువ్వు నిజం చెప్పలేదు అబద్ధం దాచావు అని అడుగుతుంది. నేను ఏమి దాయలేదు మమ్మీ నిన్ననే ఇచ్చారు. సంతకం పెట్టి ఈరోజు మేడంకి ఇస్తాను అని అవన్నీ తో ఆరాధ్య అంటుంది.. అవని మాత్రం రిపోర్టుని మొత్తం చెక్ చేసి అటెండ్స్ చాలా తక్కువ ఉంది నువ్వు ఇలా చేయడం తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు ఏంటి అని సీరియస్ అవుతుంది.. కానీ ఆరాధ్య మాత్రం బాధపడిపోతుంది అని అక్షయ్ సంతకం పెట్టడంతో అవని నీతో నేను మాట్లాడడం మానేస్తాను అని సీరియస్ అవుతుంది.. ప్రతిరోజు ఆరోగ్య చేస్తున్న తప్పుని మీరు వెనకేసుకొనే వస్తున్నారు. నేను మీతో మాట్లాడటం మానేస్తాను అని అక్షయ్కి షాక్ ఇస్తుంది.
పల్లవి ఎలాగైనా సరే మా నాన్నని అడిగి డబ్బులు తీసుకురావాలి అని అనుకుంటుంది.. ఇక చక్రధర్ దగ్గరికి వెళ్ళిన పల్లవికి చక్రధారి ఎంతో ప్రేమగా పలకరింపుతో రమ్మని పిలుస్తాడు.. అయితే నేను వచ్చింది మీ మీద ప్రేమతో కాదు అని పల్లవి అనగానే మరి ఎందుకు వచ్చావు అని సీరియస్గా అడుగుతాడు. ఒక పది లక్షలు డబ్బులు కావాలి అని అనగానే నేను అవసరం లేదు కానీ నా డబ్బులు నీకు కావాలా అని చక్రధర్అంటాడు.. నీకు డబ్బులు ఇవ్వాలి అంటే అవినీతో దగ్గరికి వెళ్లి నువ్వు నిజం చెప్పు ఆ తర్వాత నేను 20 లక్షలు కాదు కోటి రూపాయలైనా నీకు ఇస్తానని చెప్పడంతో అవని తప్ప నేను అవసరం లేదా అని పల్లవి సీరియస్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : బుధవారం టీవీ సినిమాలు.. రెండు మస్ట్ వాచ్..