Intinti Ramayanam Today Episode june 24th: పల్లవి ఫ్రెండ్స్ లోపలికి రాగానే పల్లవి భానుమతిని కాఫీ పెట్టి తీసుకురామని అంటుంది.. చేతగాడం లేదే నువ్వే పెట్టుకో అనేసి అనగానే అప్పుడే అక్కడ కనిపించిన మీనాక్షిని చూసి పల్లవి ఏయ్ ఇక్కడ మా అందరికీ కాఫీలు పెట్టి తీసుకురావాలి అని ఆర్డర్ వేస్తుంది.. ఇక మీనాక్షి తప్పక వాళ్లందరికీ కాఫీ పెట్టి తీసుకొని వెళుతుంది.. అయితే అక్కడ పల్లవి ఫ్రెండ్స్ కి మీనాక్షి పొరపాటున కాఫీ మీద పడిపోతుంది.. కాఫీల మీద పడిపోవడానికి కారణం మీనాక్షి అని పల్లవి చాలా కోపంగా ఉంటుంది.. కాఫీ ఇవ్వడం కూడా నీకు చేత కదా ఈ వయసులో నువ్వు భర్తతో కులుకుతున్నావని ఘోరంగా అవమానించడం మాట్లాడుతుంది. అయితే పల్లవి మాటలుకు బాధపడ్డ మీనాక్షి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది.
మీనాక్షిని తన ఫ్రెండ్స్ ముందుగా ఘోరంగా అవమానిస్తుంది పల్లవి.. మీనాక్షిని పనిమనిషి అంటూ మాట్లాడుతూ ఘోరంగా అవమానించడంతో తను చాలా బాధపడిపోతూ ఉంటుంది.. అయితే అప్పుడే లోపలికి వచ్చిన అవని ఇదంతా చూసి షాక్ అవుతుంది.. పల్లవి ఫ్రెండ్ మీనాక్షిని పనిమనిషి అంటే ఘోరంగా తిట్టడంతో అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఏం మాట్లాడుతున్నావ్ ఎవరి గురించి ఏమంటున్నావు అని అవని అరుస్తుంది.. పనిమనిషి అని చెప్తున్నావు కదా ఎవరు పనిమనిషి ఎవరికీ పనిమనిషి అని అవని పల్లవిని కూడా కలిపి తిడుతుంది.. కొంచెం వయసుకైనా మర్యాద ఇవ్వు ఆవిడ ఎవరో తెలుసా నీ కన్న తల్లి లాంటిది అని పల్లవికి ఎంతగా నిజం చెప్పాలని ప్రయత్నించినా సరే పల్లవి మాత్రం నా తల్లి తల్లే అని రాజేశ్వరి గురించి మాత్రమే మాట్లాడుతుంది.. రావని మీనాక్షి తీసుకొని లోపలికి వస్తుంది..
ఇంట్లోకి వచ్చిన అక్షయ్ ఏం వంట చేశారు ఆకలేస్తుంది అని అడుగుతాడు.. అయితే అవని మాత్రం పరధ్యానంగా ఉండడంతో ఏం జరిగింది ఎందుకలా ఉన్నావు అని అక్షయ్ అడుగుతాడు.. నాకు ఏమీ జరగలేదు పల్లవి మాత్రం తన ధోరణి మార్చుకోలేక పోతుంది అని అనగానే ఏమైంది మళ్లీ ఏం చేసింది అని అక్షయ్ అడుగుతాడు.. తను మా అమ్మని చాలా ఘోరంగా అవమానించింది ఇందాక తన ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళ ముందర పనిమనిషి అంటూ దారుణంగా మాట్లాడింది అని అవని చెప్పగానే అక్షయ్ చాలా కోపంగా ఉంటాడు. తనకి ఎలా చెప్పాలో అలా చెప్పాలి అని అక్షయ్ కూడా అనడంతో అవని అలా కాదండి మా అమ్మ కూడా బాధపడిపోతుంది కదా తన కూతురు పల్లవి అని తెలిస్తే ప్రేమ కురిపిస్తుంది కదా అలా అయిన తను మారాచ్చేమో చూద్దామని అవని అంటుంది.. ఏదైనా సరే మెల్లగా పల్లవి మారితే బాగుండు అని అక్షయ్ అంటాడు..
శ్రీకర్ కామన్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు కోర్టులో జడ్జి గారిని గడగడలాడించావు అవతల లాహిరిని మాట్లాడిన ఇవ్వకుండా చేశావు. అందుకే మనం మీనాక్షి అత్తయ్యని బయటికి తీసుకొచ్చాము అని ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రియ మీ అన్నయ్య ఈ కేసు గెలిస్తే ఏం ప్రయోజనం ఉంది చెప్పు అని అంటుంది.. ఇది మర్డర్ కేస్ కాబట్టి బయట వాదిస్తే ఖచ్చితంగా లక్షలు రెండు లక్షలు మనకు ఫీజు వచ్చేది. కానీ ఇంట్లోనే వాదించాడు కాబట్టి ఒక్క రూపాయి కూడా ఇచ్చే వాళ్ళు లేరు అని శ్రేయ ఘోరంగా మాట్లాడుతుంది.
రాత్రి అవ్వగానే అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఆ టైంలో పల్లవికి మీనాక్షి సాంబార్ వడ్డిస్తుంది. పల్లవి నువ్వేమి నాకు వడ్డించదు. నువ్వు వడ్డిస్తే అసలు తినను కూడా తినను అని అక్కడి నుంచి లేచిపోతుంది. అయినా కూడా మీనాక్షి వదలకుండా తనకోసం పాలు తీసుకొని లోపలికి వెళ్తుంది. అది చూసినా పల్లవి నువ్వంటేనే నాకు అసహ్యం అలాంటిది నువ్వు ఏం తెచ్చిన నేను ఎలా తాగుతాను అని అనుకుంటున్నావు అంటూ గోరంగా అవమానిస్తుంది. ఇక మీనాక్షి తన కూతుర్లాంటి పల్లవి తనని ఇలా మాట్లాడుతుంది అని బాధపడిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.
Also Read :Gundeninda Gudigantalu Balu : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ బాలు ఏం చదివాడో తెలుసా..?